Begin typing your search above and press return to search.

ధనుష్ - శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ సెట్ అవడం వెనుక సాయి పల్లవి హస్తం ఉందా?

By:  Tupaki Desk   |   20 Jun 2021 3:30 AM GMT
ధనుష్ - శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ సెట్ అవడం వెనుక సాయి పల్లవి హస్తం ఉందా?
X
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ అరుదైన కాంబినేషన్ ను చూడబోతున్నాం. పాన్ ఇండియా స్టార్ ధనుష్ - సెన్సిబుల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికలో ఓ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఎవరూ ఊహించని ఈ కాంబోలో సినిమా అంటూ అధికారిక ప్రకటన రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. నిన్నటి నుంచి మీడియాలో సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించే చర్చించుకుంటున్నారు.

జాతీయ అవార్డులు అందుకున్న ధనుష్ - శేఖర్ కమ్ముల కెరీర్ గ్రాఫ్ ను పరిశీలిస్తే.. ఇద్దరూ తమ అభిరుచి మేరకు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఇద్దరివీ విభిన్న దృవాలు. ధనుష్ ఊర మాస్ అయితే శేఖర్ కమ్ముల క్లాస్. ధనుష్ ఎంపిక చేసుకునే కథలన్నీ రా అండ్ రస్టిక్ గా.. పాత్రలు విలక్షణంగా ఉంటాయి. శేఖర్ కమ్ముల దీనికి ఎగ్జాక్ట్ ఆపొజిట్. సున్నితమైన ప్రేమకథలు.. సాఫ్ట్ రోల్స్.. వైలెన్స్ కు ఆమడ దూరంలో ఉండేలా ఆయన సినిమాలు తెరకెక్కిస్తుంటారు.

ఇలా రెండు వేర్వేరు దారుల్లో ప్రయాణం చేసే ఈ ఇద్దరూ ఎలా కలిసారనే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో క్రేజీ కాంబో సెట్ అవడం వెనుక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హస్తం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఆమె ఇద్దరితో సన్నిహితంగా ఉండటమే. 'ఫిదా' సినిమాతో సాయి పల్లవిని టాలీవుడ్ కు పరిచయం చేసిన శేఖర్ కమ్ముల.. ఇప్పుడు 'లవ్ స్టోరీ' అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నాడు.

మరోవైపు ధనుష్ తో కలిసి 'మారి 2' సినిమా చేసింది ఈ బ్యూటీ. ఇద్దరూ కలిసి రౌడీ బేబీ అంటూ రికార్డులు క్రియేట్ చేశారు. ఈ క్రమంలో ధనుష్ తో కూడా ఆమెకు మంచి స్నేహం ఏర్పడింది. ఇలా ఇద్దరితో క్లోజ్ గా ఉండే సాయి పల్లవి.. ధనుష్ వద్దకు ఈ కథను తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేసిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ త్రిభాషా చిత్రంలో ఆమెనే హీరోయిన్ అని అంటున్నారు. ఇప్పటి వరకు దక్షిణాది భాషల్లో నటించిన ఈ భామ.. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ వెండితెరపై ఓ క్రేజీ కాంబినేషన్ ని చూడబోతున్నామని అర్థం అవుతోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌ పై నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ - పి.రామ్మోహన్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్ - అత్యున్నత సాంకేతిక బృందం కలవనున్నారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.