Begin typing your search above and press return to search.

దేవి భయ్యా కాస్త కళ్లు తెరువు!

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:04 AM GMT
దేవి భయ్యా కాస్త కళ్లు తెరువు!
X
రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ జోరు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. గతంతో పోల్చితే ఈమద్య ఆయన మార్క్‌ కనిపించడం లేదు. మొన్న సంక్రాంతికి వచ్చిన మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటలు సో సోగానే ఉన్నాయి అనిపించుకున్నాయి. మహేష్‌ బాబుతో గతంలో ఈయన మంచి మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్స్‌ ఇచ్చాడు. కాని సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటలు ఆస్థాయిలో లేవని శ్రోతలు పెదవి విరుస్తున్నారు. ఒకప్పుడు దేవిశ్రీ కావాలంటూ స్టార్‌ హీరోలు పట్టుబట్టేవారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్‌ ను ఈమద్య కాస్త డల్‌ అయ్యారు అంటూ ప్రశ్నించగా అందుకు ఒప్పుకోలేదు. సరిలేరు నీకెవ్వరు చిత్రం పాటలు బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి... నాపై వస్తున్న విమర్శలకు ఆ పాటలే సమాధానం చెప్పాయి అంటూ చెప్పుకొచ్చాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని పాటలతో మళ్లీ తాను పుంజుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మహేష్‌ బాబుతో మరో సక్సెస్‌ ను దక్కించుకున్నట్లుగా దేవిశ్రీ చెప్పుకొచ్చాడు.

సరిలేరు నీకెవ్వరు పాటలతో విమర్శకుల నోర్లు మూయించాను అని దేవిశ్రీ ప్రసాద్‌ అనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆ పాటలు ఏమాత్రం బాగాలేవని చాలా నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వాటిని చూడకుండా కళ్లు మూసుకుని నా పాటలు హిట్‌ అయ్యాయి అని డబ్బా కొట్టుకోవడం ఏంటీ బాసూ అంటున్నారు. కాస్త ఇప్పటికైనా కళ్లు తెరిచి మునుపటి దేవిని మా ముందుకు తీసుకు రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

బన్నీతో సుకుమార్‌ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆ పాటలతో మళ్లీ దేవి తన రాక్‌ స్టార్‌ స్టార్‌ డం ను నిలబెట్టుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు.