Begin typing your search above and press return to search.

మరోసారి 'మూడ్ ఆఫ్ ది నేషన్'గా నిలిచిన ప్రభాస్ హీరోయిన్..!!

By:  Tupaki Desk   |   8 Aug 2020 10:10 AM GMT
మరోసారి మూడ్ ఆఫ్ ది నేషన్గా నిలిచిన ప్రభాస్ హీరోయిన్..!!
X
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. ఎప్పుడో మార్చిలో మూతబడిన సినిమా థియేటర్లు ఇంతవరకు ఓపెన్ కాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. మహమ్మారి ఏ రేంజిలో వ్యాప్తి చెందుతుందో.. ఇక ఇప్పటి వరకు సినిమా షూటింగ్స్ ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను దర్శక నిర్మాతలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెరపై ఫేవరెట్ స్టార్ల రాక లేక ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయని ఎదురు చూస్తున్నారు. కానీ హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వారి కొత్త సినిమాల అప్డేట్స్.. కొత్త ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే ప్రకారం.. సినీరంగంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఇది దీపికకు కొత్తేమి కాదు. ఇదివరకు కూడా దీపిక టాప్ లో నిలిచింది.

ఇండస్ట్రీలో కత్రినా.. ఐశ్వర్యా.. ప్రియాంక.. అనుష్క లాంటి మేటీలను వెనక్కి నెట్టేసింది దీపిక. అయితే ఈ ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో 16 శాతం ఓట్లను దీపిక కైవసం చేసుకుందట. ఆమె తర్వాత ప్రియాంక చోప్రా(14%).. మూడో స్థానంలో కత్రినా కైఫ్‌(13%).. నాలుగో స్థానం ఐశ్వర్యరాయ్‌(10).. ఆ తర్వాత అనుష్కశర్మ 9 శాతం ఓట్లను దక్కించుకున్నారు. వీరి తర్వాత యంగ్ స్టార్‌ అలియా భట్‌, బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ 6 శాతం ఓట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఇక కరీనా కపూర్‌ కేవలం 3 శాతం ఓట్లే దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. రామ్‌లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్‌ లతో పాటు లేటెస్ట్ గా చెపాక్ సినిమాతో స్టార్ హీరోయినుగా ఎదిగింది దీపిక. ఆమె కెరీర్లో ఎక్కువ హిట్లతో పాటు అత్యధిక పారితోషికం కూడా అందుకుంటుంది. ఇక తాజాగా డార్లింగ్ ప్రభాస్‌ సినిమాతో పాన్ ఇండియా మూవీ ఓకే చేసింది. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.