Begin typing your search above and press return to search.

నిర్మాతకు కరోనా...షాక్ లో బాలీవుడ్!

By:  Tupaki Desk   |   8 April 2020 11:30 PM GMT
నిర్మాతకు కరోనా...షాక్ లో బాలీవుడ్!
X
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కరోనా వైరస్ వెంటాడుతోంది. దేశంలో ఇప్పటికే సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడి దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే ఆయన ఇద్ద‌రు కూతుళ్ళకు క‌రోనా సోకి చికిత్స పొందగా, తాజాగా మొరానీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురయ్యింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారట. ప్రస్తుతం కరీం కుటుంబం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

అయితే కరీం మొరానీకి కరోనా వైరస్ కుమార్తెల నుంచే సోకి ఉంటుందని భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలో శ్రీలంక నుండి తిరిగి వచ్చిన ఆయన కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత రాజస్థాన్ నుండి తిరిగి వచ్చిన ఆయన రెండవ కూతురుకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెను కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. 'రా వన్' - 'చెన్నై ఎక్స్‌ప్రెస్' - 'హ్యాపీ న్యూ ఇయర్' - 'దిల్‌ వాలే' చిత్రాలకు కరీం నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉన్న మొరానీ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులంతా ఆశిస్తున్నారు.