Begin typing your search above and press return to search.
బిగ్ ఫిల్మ్స్ కి కరొనా బిగ్బ్రేక్
By: Tupaki Desk | 26 Jan 2022 12:30 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం.. థర్డ్ వేవ్ ప్రకంపణలు సృష్టిస్తుండగంతో చాలా వరకు భారీ చిత్రాల రిలీజ్ లని మేకర్స్ అర్థాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` నుంచి రాధే శ్యామ్, ఆచార్య, ఎఫ్ 2, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వంటి భారీ చిత్రాలు వాయిదా పడ్డాయి. దీంతో టాలీవుడ్ లో మరో సమస్య వచ్చి పడింది. కోవిడ్ కారణంగా చాలా వరకు పెద్ద చిత్రాల ఫైనల్ షెడ్యూల్ పూర్తి కాకుండానే ఆగిపోయాయి.
కోవిడ్ విళయతాండవం చేస్తున్నా చిన్న చిత్రాల షూటింగ్ లు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కానీ భారీ చిత్రాల నిర్మాణం మాత్రం ప్రస్తుతం పెండింగ్ లో పడిపోయింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో చాలా వరకు చిత్రీకరణ చివరి దశకు చేరుకుని ఆగిపోయిన పెద్ద చిత్రాలు ఎక్కువగా వుండటం గమనార్హం. ఇందులో మహేష్ బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట`తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న `హరి హర వీరమల్లు` కూడా వుంది.
`సర్కారు వారి పాట` చిత్రీకరణ చివరి దశలో వుంది. ఈ చివరి సీన్ లని మహేష్ బాబుపై చిత్రీకరించాల్సి వుందట. అయితే తనకు కోవిడ్ సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ మార్చి నుంచి సెట్స్ లో అడుగుపెడతానని చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ నటిస్తున్న `హరి హర వీరమల్లు` ఇప్పటికి 60 శాతం మాత్రమే పూర్తయింది. మరో 40 శాతం చిత్రీకరణ జరగాల్సి వుంది.
అయితే పవన్ కూడా కోవిడ్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చేశారట. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎప్పుడు మొదలు కానుందన్న విషయంలో ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. క్రిష్ కూడా ఈ విషయంలో పవన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టుగా చెబుతున్నారు. బహుషా ఈ మూవీ తాజా షెడ్యూల్ ఏప్రిల్ నుంచి మొదలయ్యే అవకాశాలు వున్నాయని టాక్. ఇక ఎన్టీఆర్ - కొరటాల మూవీ గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. `ఆచార్య` పూర్తయితే కానీ కొరటాల ఫ్రీ కాలేడు.
ఇక మెగాస్టార్ చేస్తున్న సినిమాలు కూడా నెల రోజులు బ్రేకిచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆయనకు మరోసారి కరోనా సోకడంతో చిరంజీవి నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్నా చిత్రాల షూటింగ్ లకు బ్రేక్ పడబోతోంది. `పుష్ప -2` ప్రారంభానికి సమయం వుండటంతోదానికి వచ్చిన డోకా ఏమీ లేదు. రవితేజ గురించి ఇక్కడ తక్కువ చెప్పాల్సిందే.
ఎందుకంటే పరిస్థితులు ఎలా వున్నా తన సినిమాలని మాత్రం ఆయన ఆపడం లేదు. చరణ్ - శంకర్ ల సినిమా కూడా ఇంకా మొదలు కాలేదు. సెట్స్ పూర్తయితే కానీ ఇది మొదలు కాదు. ఇక `అఖండ` తరువాత గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య కోవిడ్ కారణంగా బ్రేకిచ్చారట. దీంతో చాలా వరకు చిత్రాలు టాలీవుడ్ లో బిగ్ బ్రేక్ ని ప్రకటించాయని స్పష్టమవుతోంది.
కోవిడ్ విళయతాండవం చేస్తున్నా చిన్న చిత్రాల షూటింగ్ లు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. కానీ భారీ చిత్రాల నిర్మాణం మాత్రం ప్రస్తుతం పెండింగ్ లో పడిపోయింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో చాలా వరకు చిత్రీకరణ చివరి దశకు చేరుకుని ఆగిపోయిన పెద్ద చిత్రాలు ఎక్కువగా వుండటం గమనార్హం. ఇందులో మహేష్ బాబు నటిస్తున్న `సర్కారు వారి పాట`తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న `హరి హర వీరమల్లు` కూడా వుంది.
`సర్కారు వారి పాట` చిత్రీకరణ చివరి దశలో వుంది. ఈ చివరి సీన్ లని మహేష్ బాబుపై చిత్రీకరించాల్సి వుందట. అయితే తనకు కోవిడ్ సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ మార్చి నుంచి సెట్స్ లో అడుగుపెడతానని చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ నటిస్తున్న `హరి హర వీరమల్లు` ఇప్పటికి 60 శాతం మాత్రమే పూర్తయింది. మరో 40 శాతం చిత్రీకరణ జరగాల్సి వుంది.
అయితే పవన్ కూడా కోవిడ్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చేశారట. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ఎప్పుడు మొదలు కానుందన్న విషయంలో ఇంత వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. క్రిష్ కూడా ఈ విషయంలో పవన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టుగా చెబుతున్నారు. బహుషా ఈ మూవీ తాజా షెడ్యూల్ ఏప్రిల్ నుంచి మొదలయ్యే అవకాశాలు వున్నాయని టాక్. ఇక ఎన్టీఆర్ - కొరటాల మూవీ గురించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. `ఆచార్య` పూర్తయితే కానీ కొరటాల ఫ్రీ కాలేడు.
ఇక మెగాస్టార్ చేస్తున్న సినిమాలు కూడా నెల రోజులు బ్రేకిచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆయనకు మరోసారి కరోనా సోకడంతో చిరంజీవి నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్నా చిత్రాల షూటింగ్ లకు బ్రేక్ పడబోతోంది. `పుష్ప -2` ప్రారంభానికి సమయం వుండటంతోదానికి వచ్చిన డోకా ఏమీ లేదు. రవితేజ గురించి ఇక్కడ తక్కువ చెప్పాల్సిందే.
ఎందుకంటే పరిస్థితులు ఎలా వున్నా తన సినిమాలని మాత్రం ఆయన ఆపడం లేదు. చరణ్ - శంకర్ ల సినిమా కూడా ఇంకా మొదలు కాలేదు. సెట్స్ పూర్తయితే కానీ ఇది మొదలు కాదు. ఇక `అఖండ` తరువాత గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య కోవిడ్ కారణంగా బ్రేకిచ్చారట. దీంతో చాలా వరకు చిత్రాలు టాలీవుడ్ లో బిగ్ బ్రేక్ ని ప్రకటించాయని స్పష్టమవుతోంది.