Begin typing your search above and press return to search.

దర్శకుడిగా కొత్త పాత్రలోకి మారిన కమెడియన్ పృథ్వీ

By:  Tupaki Desk   |   30 Jan 2023 10:00 AM GMT
దర్శకుడిగా కొత్త పాత్రలోకి మారిన కమెడియన్ పృథ్వీ
X
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత కమెడియన్ గా మారిన టాలెంటెడ్ యాక్టర్ 30 ఇయర్స్ పృథ్వీ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్ళు కావడంతో ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇక్కడ అనే డైలాగ్ తో భాగా పాపులర్ కావడంతో పృథ్వీరాజ్ కి ఈ పేరు వచ్చింది. ఇక కమెడియన్ గా సక్సెస్ అయ్యి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ రాజ్ అదే పాత్రలకి పరిమితం అయిపోకుండా అప్పుడప్పుడు సీరియస్ రోల్స్ కూడా చేస్తున్నాడు.

అయితే అతనికి సీరియస్ పాత్రల కంటే కామెడీ పాత్రల ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా ఏటీఎం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పృథ్వీ రాజ్ సినిమాలో విలనీ తరహా క్యారెక్టర్ లో నటించి కావాల్సినంత వినోదాన్ని పంచారు.

ఇక నటుడిగా ఉంటూనే రాజకీయ నాయకుడిగా జనసేనలో క్రియాశీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు పృథ్వీ రాజ్ దర్శకుడి అవతారం ఎత్తాడు.

తన కూతురుని హీరోయిన్ గా పరిచయం చేయడం కోసం తానే దర్శకుడిగా మారి కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో క్రాంతి కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. ఇక పృథ్వీ రాజ్ కూతురు శ్రీలు హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఆమెని హీరోయిన్ గా నిలబెట్టడం కోసం మెగా ఫోన్ పట్టిన పృథ్వీ రాజ్ ప్రేమకథగా దీనిని ఆవిష్కరించాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపధ్యంలో తాజాగా మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సినిమా విశేషాలు పంచుకున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మూవీని శ్రీ పిఆర్ క్రియేషన్స్ బ్యానర్‌‌పై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.