Begin typing your search above and press return to search.

'శ్రీకారం' కు చిరు.. కేటీఆర్‌ లను ఒప్పించిన చరణ్‌

By:  Tupaki Desk   |   6 March 2021 4:57 PM GMT
శ్రీకారం కు చిరు.. కేటీఆర్‌ లను ఒప్పించిన చరణ్‌
X
శర్వానంద్‌ హీరోగా ప్రియాంక అరూల్‌ మోహన్ హీరోయిన్ గా కిషోర్‌ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ లో తెరకెక్కిన శ్రీకారం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు మెగాస్టార్‌ చిరంజీవి మరియు కేటీఆర్ హాజరు కాబోతున్నట్లుగా హీరో శర్వానంద్‌ ప్రకటించాడు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నారు. కనుక శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుకను అక్కడే నిర్వహించాలని భావిస్తున్నారట. ఈనెల 8వ తారీకున ఖమ్మంలో చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. అలాగే 9వ తారీకున హైదరాబాద్‌ లో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా శ్రీకారం ప్రీ రిలీజ్ వేడుక జరుగబోతున్నట్లుగా శర్వానంద్‌ పేర్కొన్నారు.

శ్రీకారం సినిమా లో రైతులకు సంబంధించిన విషయాలను వ్యవసాయం యొక్క గొప్పతనంను చూపించబోతున్నారు. ఈ మంచి సినిమా కు తప్పకుండా భారీ ప్రమోషన్‌ అవసరం అనే ఉద్దేశ్యంతో శర్వానంద్‌ కు ఆప్త మిత్రుడు అయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ ఇటీవలే చిరంజీవి మరియు కేటీఆర్ లతో మాట్లాడి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. నేడు శర్వా పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రెస్‌ మీట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్బంగా శర్వానంద్‌ మాట్లాడుతూ చరణ్‌ సినిమా పై నమ్మకంతో వారిద్దరితో మాట్లాడి అప్పటికప్పుడు ఒప్పించాడని ఒక మంచి సినిమా ప్రమోషన్ కు మీరు సహకరించాలని వారికి సూచించాడని చెప్పుకొచ్చాడు. 9వ తారీకున జరుగబోతున్న హైదరాబాద్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కేటీఆర్‌ తో పాటు చరణ్‌ కూడా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయట.