Begin typing your search above and press return to search.
ఇద్దరిని ఖుషీ చేసి ఒకరిని నిరాశపరిచిన చిరు!
By: Tupaki Desk | 25 Jan 2021 5:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఆఫర్లతో ఇద్దరు యంగ్ డైరెక్టర్లు అదే పనిగా మబ్బుల్లో తేల్తున్నారు. అంతేకాదు.. ఆ విషయాన్ని అస్సలు ఏమాత్రం ఆ ఇద్దరూ దాచుకోలేకపోతున్నారు. ఇటీవల చిరంజీవి తన తదుపరి నాలుగు సినిమాలకు పని చేసే దర్శకులతో ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ రకంగా దర్శకులకు ఆయన ముందే హామీ ఇచ్చేశారు. ఇప్పటికే ముగ్గురితో సినిమాల్ని ధృవీకరించేయగా.. ఒక దర్శకుడికి ఖాయం చేయాల్సి ఉంటుంది. అయినా ఆ దర్శకుడిని చేర్చిన ఫోటో షేర్ చేయడంతో ఇక వారి ఆనందానికి అవధులే లేవని అర్థమవుతోంది. కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని కూడా చిరు ధృవీకరించడంతో అతడి ఆనందానికి అవధుల్లేవ్.
``నా నలుగురు కెప్టెన్లు ఈ నలుగురు. ఫెంటాస్టిక్ 4.. చార్ కా దమ్`` అంటూ చిరు వ్యాఖ్యను జోడించడంతో ఆ నలుగురి ఆనందం పీక్స్ కి చేరుకుంది. కొరటాల శివ ఆచార్యకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేసవిలో ఈ మూవీని రిలీజ్ కి తేనున్నారు. లూసీఫర్ రీమేక్ కోసం మోహన్ రాజాని దర్శకుడిగా ఎంపిక చేశారు. సెట్స్ పైకి వెళుతున్నారు. వేదాళం రీమేక్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారు. ప్రీప్రొడక్షన్ సాగుతోంది. జై లవకుశ ఫేమ్ బాబీకి ఆఫర్ ఉంది. అతడు స్క్రిప్టు పనిలోనే ఉన్నాడు.
చిరు భరోసాతో బాబీ ఆనందానికి హద్దులు లేవు. ``లవ్ యు సార్. నా బాల్యం నుండే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నా మెగాస్టార్ కు దర్శకత్వం వహించే అవకాశం దక్కడం అంటే కల నిజమైనట్టు. మీతో కలిసి పనిచేయడానికి ఇంకా వేచి ఉండలేము సార్`` అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మెహర్ రమేష్ స్పందన ఆసక్తికరం. ``మై లవ్ .. ఫాండమ్.. చిరు పట్ల పిచ్చి ఎప్పుడూ అనంతమైనది.. ఎనలేనిది. లైఫ్ టైమ్ డ్రీం ట్రూ టు డైరెక్ట్ మెగాస్టార్. కృతజ్ఞతతో`` అంటూ మెహర్ వ్యాఖ్యానించారు. మెహర్ రమేష్ చాలా సంవత్సరాలుగా చిరుకు దగ్గరగా ఉన్నారు. మహమ్మారీ క్రైసిస్ లో చిరంజీవి ప్రారంభించిన సీసీసీ కోసం అతడు సిన్సియర్ గా పని చేశారు.
అంతా బాగానే ఉంది కానీ.. సాహో దర్శకుడు సుజీత్ కి ఓ రీమేక్ విషయంలో అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. తన విషయంలోనూ చిరు మరో మారు ఆలోచిస్తారేమో..! అతడు స్క్రిప్టుతో మెప్పించడం ద్వారా మాత్రమే అవకాశం దక్కించుకోగలరు.
``నా నలుగురు కెప్టెన్లు ఈ నలుగురు. ఫెంటాస్టిక్ 4.. చార్ కా దమ్`` అంటూ చిరు వ్యాఖ్యను జోడించడంతో ఆ నలుగురి ఆనందం పీక్స్ కి చేరుకుంది. కొరటాల శివ ఆచార్యకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వేసవిలో ఈ మూవీని రిలీజ్ కి తేనున్నారు. లూసీఫర్ రీమేక్ కోసం మోహన్ రాజాని దర్శకుడిగా ఎంపిక చేశారు. సెట్స్ పైకి వెళుతున్నారు. వేదాళం రీమేక్ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారు. ప్రీప్రొడక్షన్ సాగుతోంది. జై లవకుశ ఫేమ్ బాబీకి ఆఫర్ ఉంది. అతడు స్క్రిప్టు పనిలోనే ఉన్నాడు.
చిరు భరోసాతో బాబీ ఆనందానికి హద్దులు లేవు. ``లవ్ యు సార్. నా బాల్యం నుండే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నా మెగాస్టార్ కు దర్శకత్వం వహించే అవకాశం దక్కడం అంటే కల నిజమైనట్టు. మీతో కలిసి పనిచేయడానికి ఇంకా వేచి ఉండలేము సార్`` అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. మెహర్ రమేష్ స్పందన ఆసక్తికరం. ``మై లవ్ .. ఫాండమ్.. చిరు పట్ల పిచ్చి ఎప్పుడూ అనంతమైనది.. ఎనలేనిది. లైఫ్ టైమ్ డ్రీం ట్రూ టు డైరెక్ట్ మెగాస్టార్. కృతజ్ఞతతో`` అంటూ మెహర్ వ్యాఖ్యానించారు. మెహర్ రమేష్ చాలా సంవత్సరాలుగా చిరుకు దగ్గరగా ఉన్నారు. మహమ్మారీ క్రైసిస్ లో చిరంజీవి ప్రారంభించిన సీసీసీ కోసం అతడు సిన్సియర్ గా పని చేశారు.
అంతా బాగానే ఉంది కానీ.. సాహో దర్శకుడు సుజీత్ కి ఓ రీమేక్ విషయంలో అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. తన విషయంలోనూ చిరు మరో మారు ఆలోచిస్తారేమో..! అతడు స్క్రిప్టుతో మెప్పించడం ద్వారా మాత్రమే అవకాశం దక్కించుకోగలరు.