Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ముందే ఊహించారట!

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:30 PM GMT
మెగాస్టార్ ముందే ఊహించారట!
X
కొన్ని అనుభవాలతో ఏదైనా ముందే ఊహించొచ్చు. అయితే ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీ లో మెగా స్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి 'అల వైకుంఠ పురములో' కి సంబంధించి ఈ రేంజ్ సక్సెస్ ను ముందే ఊహించారట. ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో పంచుకున్నాడు అల్లు అర్జున్.

'మావయ్య రిలీజ్ రోజు మద్యాహ్నం ఇంట్లో సినిమాను చూసారు. ఆయనతో పాటు ఓ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. చూసాక నాతో త్రివిక్రమ్ గారితో ఆయన పొందిన అనుభూతి పంచుకున్నారు. ఇది చాలా పెద్ద హిట్టవుతుంది చూడండి అన్నారు. ఆయనకు బాగా నచ్చడం వల్ల అలా అన్నారేమో అనుకున్నాం. తీరా చూస్తే అదే నిజమైంది. అనుభవంతో ఆయన ఊహ నిజమైంది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు.

ఇక 'అల వైకుంఠ పురములో' కి సంబంధించి మొదటి థాంక్స్ వక్కంతం వంశీ కి చెప్పాలి ఆయనే నా పేరు సూర్య తర్వాత మీరు త్రివిక్రమ్ గారు సినిమా చేస్తే బాగుంటుంది అన్నారు. నేను మూడో సారి కదా సప్రైజ్ ఏముంటుంది అనుకున్నాను. ఆ డిస్కర్షన్ లో బన్నీ వాస్ కూడా అక్కడే ఉన్నాడు. తను కూడా అదే మా కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని చెప్పాడు. వాళ్ళిద్దరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు బన్నీ.