Begin typing your search above and press return to search.

సైరా గురించి ప‌రుచూరి దాచేసిన నిజం

By:  Tupaki Desk   |   18 Sep 2019 9:38 AM GMT
సైరా గురించి ప‌రుచూరి దాచేసిన నిజం
X
తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. తెల్ల వాళ్ల గుండెల్లో గుబులు పుట్టించి గెరిల్లా త‌ర‌హా పోరాటాన్ని సాగించిన యోధుడి క‌థ‌ని నేటి త‌రానికి చెప్పాల‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. చిరంజీవితో త‌మ క‌ల‌ని నిజం చేసుకోవాల‌ని గ‌త ప‌దేళ్ల క్రితం అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. బ‌డ్జెట్ - భారీ కాస్టింగ్- మార్కెట్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ క‌థ‌ని ప‌దేళ్ల క్రితం ప‌క్క‌న పెట్టారు. `బాహుబ‌లి` విజ‌యంతో అనూహ్యంగా తెలుగు సినిమా మార్కెట్ అంత‌ర్జాతీయంగా పెరిగింది. క్రేజూ పెరిగింది.

దీంతో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ మ‌ళ్లీ తెర‌పైకి తీసుక‌రావాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. చిరంజీవి ముందుకు రావ‌డంతో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ప‌దేళ్ల క‌ల ఇప్ప‌టికి సాకారం అవుతోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నాలుగు భాష‌ల్లో రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌డంలో ఈ చిత్రానికి హిందీలోనూ మంచి డిమాండ్ ఏర్ప‌డింది. హిందీలో ఈ చిత్రాన్ని ఫ‌ర్హాన్ అక్త‌ర్ ఎక్స్‌ల్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై రిలీజ్ చేస్తున్నాడు. అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అ వెంట్‌ని చిత్ర బృందం బుధ‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించింది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ `సైరా` పై ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. `సైరా` ఓ మ‌హా అద్భుత‌మ‌ని.. ఇలాంటి అద్భుత‌మైన చిత్రానికి ప‌నిచేయ‌డంతో మా క‌ల నెర‌వేరింద‌ని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా గురించి ఎక్కువ‌గా మాట్లాడొద్దని.. సినిమా చూసి ప్రేక్ష‌కులే చెప్పాల‌ని చిరంజీవి టీమ్ మెంబ‌ర్స్ కి చెప్పిన‌ట్లు అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. `బాహుబ‌లి`ని స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబ‌ట్టాల‌ని ఆకాంక్షించారు.