Begin typing your search above and press return to search.
అల్లు వారితో లొల్లిపై మెగాస్టార్ సూపర్ క్లారిటీ
By: Tupaki Desk | 9 April 2020 7:50 AM GMTమెగా ఫ్యామిలీ లో మనస్ఫర్థలు ఉన్నాయంటూ గతంలో చాలా సార్లు మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. వాటిపై స్పందించకుండానే సందర్బానుసారంగా ఆ పుకార్లకు మెగా ఫ్యామిలీ చెక్ పెడుతూ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు చిరంజీవికి మద్య దూరం ఉందంటూ గతంలో పలు సార్లు ప్రచారం జరిగింది. ఆ పుకార్లు పుట్టించిన వారిని కొట్టినట్లుగా మెగా ఫ్యామిలీ ముఖ్యమైన సందర్బం సమయంలో కలుస్తూనే ఉన్నారు. ఇక ఈ మద్య కాలంలో మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా మెగాస్టార్ తో అల్లు వారి ఫ్యామిలీకి పడటం లేదంటూ పుకార్లు జోరుగా వస్తున్నాయి.
తాజాగా చిరంజీవి ఆ విషయమై అందరి నోళ్లు మూయించేలా క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వచ్చే సిల్లీ పుకార్ల గురించి స్పందించాల్సిన అవసరమే లేదు. కాని ఫ్యాన్స్ లో గందరగోళం లేకుండా ఉండే ఉద్దేశ్యంతో చిరంజీవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై స్పందించారు. గతంలో పవన్ కు నాకు విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. కాని పవన్ ఎప్పుడు ఆంధ్రా నుండి హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి వచ్చి నా భార్య సురేఖ చేతి వంట తప్పకుండా తింటాడు. కాని మీడియా ఆ విషయాలపై చర్చించదు.
ఇప్పుడు అల్లు ఫ్యామిలీ తో మాకు విభేదాలు అంటూ సృష్టించారు. మేము కుటుంబం అని చెప్పాం అంటే అందులో అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా వస్తుంది. మేమంతా కూడా ఒక్కటే అంటూ చిరంజీవి అల్లు వారితో ఉన్న గొడవలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. నిన్నటికి నిన్న కూడా చిరంజీవి ట్విట్టర్ లో బన్నీ బర్త్ డే సందర్బంగా ఫొటోను షేర్ చేసి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి నువ్వు బాగుండాలబ్బా అంటూ ఆశీర్వదించిన విషయం తెల్సిందే. ఇంత మంచి సంబంధం ఉండగా కొందరు మాత్రం పుకార్లు పుట్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు వారితో లొల్లిపై మెగాస్టార్ స్పందించడంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలతో కాస్త కన్ఫ్యూజ్ అవ్వడంతో పాటు గందరగోళంకు గురైన మెగా ఫ్యాన్స్ కు ఇప్పుడు అల్లు వారితో లొల్లిపై క్లారిటీ వచ్చింది. ఫ్యాన్స్ గురించి ఈ చిన్న విషయాన్ని కూడా ఆలోచించి ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి నిజంగా మెగాస్టార్ ఆఫ్ ఇండియా అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా చిరంజీవి ఆ విషయమై అందరి నోళ్లు మూయించేలా క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వచ్చే సిల్లీ పుకార్ల గురించి స్పందించాల్సిన అవసరమే లేదు. కాని ఫ్యాన్స్ లో గందరగోళం లేకుండా ఉండే ఉద్దేశ్యంతో చిరంజీవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై స్పందించారు. గతంలో పవన్ కు నాకు విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారు. కాని పవన్ ఎప్పుడు ఆంధ్రా నుండి హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి వచ్చి నా భార్య సురేఖ చేతి వంట తప్పకుండా తింటాడు. కాని మీడియా ఆ విషయాలపై చర్చించదు.
ఇప్పుడు అల్లు ఫ్యామిలీ తో మాకు విభేదాలు అంటూ సృష్టించారు. మేము కుటుంబం అని చెప్పాం అంటే అందులో అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా వస్తుంది. మేమంతా కూడా ఒక్కటే అంటూ చిరంజీవి అల్లు వారితో ఉన్న గొడవలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. నిన్నటికి నిన్న కూడా చిరంజీవి ట్విట్టర్ లో బన్నీ బర్త్ డే సందర్బంగా ఫొటోను షేర్ చేసి మరీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి నువ్వు బాగుండాలబ్బా అంటూ ఆశీర్వదించిన విషయం తెల్సిందే. ఇంత మంచి సంబంధం ఉండగా కొందరు మాత్రం పుకార్లు పుట్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు వారితో లొల్లిపై మెగాస్టార్ స్పందించడంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలతో కాస్త కన్ఫ్యూజ్ అవ్వడంతో పాటు గందరగోళంకు గురైన మెగా ఫ్యాన్స్ కు ఇప్పుడు అల్లు వారితో లొల్లిపై క్లారిటీ వచ్చింది. ఫ్యాన్స్ గురించి ఈ చిన్న విషయాన్ని కూడా ఆలోచించి ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి నిజంగా మెగాస్టార్ ఆఫ్ ఇండియా అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.