Begin typing your search above and press return to search.

త్రిష చెప్పింది అబద్దమా? చిరు చెప్పేది అబద్దమా?

By:  Tupaki Desk   |   9 April 2020 8:30 AM GMT
త్రిష చెప్పింది అబద్దమా? చిరు చెప్పేది అబద్దమా?
X
ఆచార్య చిత్రం నుండి త్రిష తప్పుకోవడం ఆ స్థానంలో కాజల్‌ ను తీసుకోవడం జరిగి పోయింది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే ఆచార్య షూటింగ్‌ పున: ప్రారంభం కానుంది. చిరంజీవి తో పాటు కాజల్‌ షూటింగ్‌ లో జాయిన్‌ కాబోతుంది. అయితే త్రిష సినిమాను వదిలి పెట్టడానికి గల కారణం ఏంటీ అనే విషయమై క్లారిటీ రాలేదు. ఆచార్యను వదిలేస్తున్నట్లుగా త్రిష ప్రకటిస్తూ మొదట చెప్పింది ఒకలా ఉంది ఇప్పుడు మరోలా ఉంది. క్రియేటివ్‌ డిఫరెన్స్‌ వల్ల ఈ సినిమా నేను చేయలేక పోతున్నాను. తెలుగులో త్వరలోనే మరో సినిమాతో వస్తానంటూ ట్వీట్‌ చేసిన విషయం తెల్సిందే.

సినిమాలో ఆమె పాత్ర తగ్గించడంతో పాటు మొదట చెప్పిన విధంగా కాకుండా షూటింగ్‌ కు వచ్చేప్పటికి పాత్రను మార్చేశారేమో అందుకే ఆచార్యను వదిలేసిందేమో అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేశారు. అయితే చిరంజీవి తాజాగా ఒక ఇంగ్లీష్‌ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం మరో విధంగా స్పందించాడు. చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఏ ఒక్కరితో కూడా ఆమెకు వివాదం జరగలేదు.. విభేదించలేదు.

నేను అందరితో మాట్లాడినా కూడా ఆమెతో ఎవరికి ఇబ్బంది లేదన్నారు. వివాదం లేకుండానే మణిరత్నం సినిమా ఆఫర్‌ వచ్చిన కారణంగా వెళ్లి పోయిందని చిరు పేర్కొన్నాడు. ఆమె కోసం నా కూతురు సుష్మిత కాస్ట్యూమ్స్‌ కూడా రెడీ చేసింది. ఆమెతో ఎవరికి ఎలాంటి వివాదం అయితే లేదు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

క్రియేటివ్‌ డిఫరెన్స్‌ వల్ల తాను ఆచార్యను వదిలేస్తున్నట్లుగా త్రిష ప్రకటించగా చిరంజీవి ఆమెకు మణిరత్నం సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. ఎవరితో ఆమెకు వివాదాలు విభేదాలు లేవు అంటూ చెప్పాడు. వీరిద్దరు కూడా పూర్తి విరుద్దమైన కారణాలు చెప్పడంతో అసలు విషయం ఏంటీ..? వీరిద్దరిలో నిజం చెబుతున్నది ఎవరు? అబద్దం చెబుతున్నది ఎవరు? అనే చర్చ సినీ వర్గాల్లో ఇంకా సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది.