Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌- శంక‌ర్ పాన్ ఇండియా మూవీలో ర‌ష్మిక జాక్ పాట్

By:  Tupaki Desk   |   22 Feb 2021 4:59 AM GMT
చ‌ర‌ణ్‌- శంక‌ర్ పాన్ ఇండియా మూవీలో ర‌ష్మిక జాక్ పాట్
X
వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టాట‌స్ అందుకుంది ర‌ష్మిక మంద‌న‌. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప` చిత్రంలో న‌టిస్తోంది. దీంతో పాటే వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లోనూ న‌టిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో పుష్ప లాంటి పాన్ ఇండియా ఆఫ‌ర్ త‌న‌కు ద‌క్క‌డం మ‌రో కీల‌క మ‌లుపు అనే చెప్పాలి. దీనికి మించి ఇప్పుడు మ‌రో క్రేజీ పాన్ ఇండియ చిత్రంలోనూ అవ‌కాశం అందుకుని సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌బోతోంది ర‌ష్మిక‌.

ది గ్రేట్ శంకర్ దర్శకత్వం వహించబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలో రష్మిక‌ మందన్న క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ రొమాన్స్ చేసేందుకు ర‌ష్మిక అంగీక‌రించింద‌ని కాల్షీట్లు స‌ర్ధుబాటు చేస్తోంద‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం పెద్ద మొత్తంలో కాల్షీట్ల‌ను స‌ర్ధుబాటు చేయాల్సి ఉంటుంది. నిజానికి ఆచార్యలో రామ్‌ చరణ్ తో రష్మిక జత కట్టాల్సి ఉన్నా ఆఫ‌ర్ మిస్స‌య్యింది. రష్మిక స్థానంలో పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తోంది. నిజానికి ఆచార్య ఛాన్స్ మిస్స‌యినా ర‌ష్మిక ఆ త‌ర్వాత బాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాలు అందుకుంది. ఇప్పుడు అదే త‌న‌కు శంక‌ర్ పాన్ ఇండియా సినిమాలో అవ‌కాశం ద‌క్కేందుకు కార‌ణం అని తెలుస్తోంది. ర‌ష్మిక `మిషన్ మజ్ను` అనే చిత్రంతో రష్మిక బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. దీంతో పాటే హిందీలో ప‌లు క్రేజీ చిత్రాల్లో న‌టించ‌నుంది.