Begin typing your search above and press return to search.

ఒకే రోజు వస్తోన్న 'అల్లు' సినిమాలు..?

By:  Tupaki Desk   |   24 Sep 2022 1:30 AM GMT
ఒకే రోజు వస్తోన్న అల్లు సినిమాలు..?
X
టాలీవుడ్ లో దసరా సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలపై క్లారిటీ వచ్చిన తర్వాత.. మిగతా చిన్న మీడియం రేంజ్ చిత్రాలన్నీ డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. అందులో చాలా నెలలుగా నిర్మాణంలోనే సినిమాలు కొన్ని లేటెస్టుగా విడుదల తేదీలను ప్రకటించాయి. అయితే ఒకే రోజున రాబోతున్నట్లు ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అనివార్యంగా మారింది.

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు టైటిల్ రోల్ లో నటించిన చిత్రం ''శాకుంతలం''. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శాకుంతలం - దుశ్యంతుడు ప్రేమగాథ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతికతో రూపొందిస్తున్నారు.

అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకుంది. మైథలాజికల్ డ్రామా కావడంతో భారీగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ అవసరమయ్యాయి. విజువల్ గ్రాండియర్ గా తీర్చిదిద్దే క్రమంలో ఆలస్యమవుతూ వచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 'శాకుంతలం' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

మరోవైపు యువ హీరో అల్లు శిరీష్ తన హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ లో నటించిన చిత్రాన్ని కూడా నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాకేష్ శశి దర్శకత్వంలో 'ప్రేమ కాదంట' పేరుతో ఆ మధ్య ఫస్ట్ లుక్ వదిలారు. ఇందులో అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించింది.

అయితే మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏదైతేనేం నవంబర్ 4న సమంత మరియు అల్లు శిరీష్ పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఓపక్క దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత ఉంటే.. మరోవైపు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఉన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలు ఉన్నా.. ఎందుకనో ఈ రెండు చిత్రాలు లేట్ అయ్యాయి.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అల్లు ఫ్యామిలీ నాలుగో తరం నుంచి అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా 'శాకుంతలం' సినిమాతో ఇండస్ట్రీలో లాంచ్ అవుతోంది. అల్లు అర్జున్ కుమార్తె ఇందులో లిటిల్ భరత పాత్రలో నటించింది. అంటే అల్లు ఫ్యామిలీతో సంబంధం ఉన్న రెండు సినిమాలూ ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయన్నమాట. దీంతో అల్లు ఫ్యామిలీ మరియు అభిమానులు రెండు చిత్రాలనూ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది.

మరోవైపు సమంత మరియు అల్లు శిరీష్ సినిమాల మధ్యన 'బనారస్' అనే కన్నడ డబ్బింగ్ సినిమా కూడా రాబోతోంది. కర్నాటక సీనియర్ రాజకీయ నాయకుడు జమీర్ అహ్మద్ ఖాన్ తనయుడు జైద్ ఖాన్‌ హీరోగా లాంచ్ చేస్తున్న ఈ చిత్రాన్ని.. నవంబర్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇలా ఒకే రోజు రెండు పాన్ ఇండియా సినిమాలు మరియు ఒక తెలుగు మూవీ బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగే పరిస్థితి వచ్చింది. మరి ఈ మూడింటిలో ఏవేవి విజయం సాధిస్తాయి?.. రానున్న రోజుల్లో రిలీజ్ డేట్స్ విషయంలో మార్పులు ఉంటాయా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.