Begin typing your search above and press return to search.

ఇటలీలో రాధేశ్యామ్.. షూటింగ్ భయానకం అన్న పూజా హెగ్డే

By:  Tupaki Desk   |   19 Oct 2020 7:30 AM GMT
ఇటలీలో రాధేశ్యామ్.. షూటింగ్ భయానకం అన్న పూజా హెగ్డే
X
కరోనా దెబ్బకు యావత్ ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. అన్నింటికంటే ఎక్కువ దెబ్బ పడింది సినిమా ఇండస్ట్రీపైనే. అన్ని వ్యవస్థలు తెరుచుకున్నా.. సినీ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటికీ కోలుకోవడం లేదు. థియేటర్లు తెరిచినా ఈగ కూడా లోనికి రావడం లేదు. ఈ క్రమంలోనే షూటింగ్ లు అయితే మొదలయ్యాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం యూనిట్ గత 10 రోజులుగా ఇటలీలో షూటింగ్ చేస్తున్నారు.

ప్రపంచంలోనే కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అంత్యంత దెబ్బతిన్న యూరోపియన్ దేశాలలో ఇటలీ ఒకటి అని అందరికీ తెలుసు. ఇక్కడ వైరస్ తీవ్రత బాగా ప్రబలి దేశ జనాభాలో మిలియన్ల మంది ఆస్పత్రి పాలయ్యారు. ఆస్పత్రులు బెడ్స్ సరిపోక ఆదేశంలోని 70 ఏళ్లు దాటిన వృద్ధులను చికిత్స చేయలేక వదిలేశారు. శవాలను కుప్పలుగా ఖననం చేసిన వీడియోలు చూశాం. వృద్ధులు చాలా మంది కరోనా ధాటికి చనిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ దేశం కరోనా నుంచి కోలుకుంటోంది. అయితే కేసులు మాత్రం తగ్గడం లేదు. నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రాధేశ్యాం టీం అక్కడ సాహసమే చేస్తూ షూటింగ్ జరుపుకుంటోంది.

కరోనా కేసుల పెరుగుదల మధ్య ఇటలీలో రాధేశ్యామ్ యూనిట్ ఎలా షూటింగ్ చేస్తున్నారో పూజా తాజాగా వెల్లడించింది.. "కరోనావైరస్ ప్రభావం ఇటలీలో చాలా తీవ్రంగా ఉంది. షెడ్యూల్ మొదటి రెండు రోజులు షూటింగ్ చాలా భయానకంగా జరిగింది. ఆ కరోనా తీవ్రతకు నేను చాలా భయపడ్డాను. తీవ్రమైన జాగ్రత్తలు పాటించిన తర్వాత షూటింగ్ చేస్తున్నాం. మొత్తం యూనిట్ సభ్యులందరూ రోజూ కరోనా పరీక్షలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. రోజంతా ముసుగులు తప్పనిసరి. కేవలం కెమెరా ముందు వెళ్లేటప్పుడు మాత్రమే మేము ముసుగులు తీస్తున్నాం ”అంటూ రాధేశ్యామ్ షూటింగ్ కష్టాలను పూజా వివరించారు. దీన్ని బట్టి ఇటలీలో కరోనా పరిస్థితుల మధ్య రాధేశ్యామ్ షూటింగ్ భయానకంగా సాగుతోందని అర్థమవుతోంది.