Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. మ‌హేష్ షూటింగ్ కు బ్రేక్‌

By:  Tupaki Desk   |   16 Sep 2021 4:30 AM GMT
ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. మ‌హేష్ షూటింగ్ కు బ్రేక్‌
X
అభిమానుల అత్యుత్సాహం అప్పుడ‌ప్పుడు స్టార్ హీరోల‌కు తీవ్ర ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుంటుంది. అభిమానం హ‌ద్దులు దాటిన‌ప్పుడు హీరోలు కూడా ఏమీ చేయ‌లేరు. వారి వొత్తిడికి చేతులెత్తేయాల్సిందే. ఇలాంటి సంఘ‌ట‌న‌లు స్టార్ హీరోల విష‌యంలో ఈ మ‌ధ్య చాలానే జ‌రుగుతున్నాయి. అలాంటి సంఘ‌ట‌నే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కు ఎదురైంది. ఇంకే ముంది జోరుగా సాగుతున్న సినిమా షూటింగ్ ని అర్థాంత‌రంగా ఆపేయాల్సి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. స్టార్ హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం డైరెక్ష‌న్ లో `స‌ర్కారు వారి పాట‌` చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్ లోని ప‌లు లొకేష‌న్ ల‌లో కీలక యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో పాటు ఛేజింగ్ సీన్ ల‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ఛేజింగ్ సీన్ ల‌ని హైద‌రాబాద్ లో షూట్ చేస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ తో క‌లిసి 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం గ‌త కొన్ని రోజులుగా ఉప్ప‌ల్ మెట్రో డిపోలో ప‌లు యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు.

మహేష్ బాబు సినిమా షూటింగ్ జ‌ర‌చుగుతోందిని త‌ను కూడా ఉన్నాడని వార్తలు వినిపించ‌డంతో భారీ సంఖ్య‌లో ప్రజలు ఆయ‌న అభిమానులు అక్క‌డికి తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో క్రౌడ్ మ‌రింత ఎక్కువ‌గా పెరిగింది. అనూహ్యంగా అభిమానుల తాకిడి పెర‌గ‌డంతో చిత్ర బృందం మెట్రో డిపోలో షూటింగ్‌ని అర్థాంత‌రంగా నిలిపి వేశారు. ఇక్క‌డ మహేష్ బాబు విలన్ ని బైక్ మీద వెంబడించే స‌న్నివేశాల్ని చిత్రీక‌రించారు. ఆ త‌రువాత ఇదే ప్లేస్‌లో మేకర్స్ సముద్రకని సీక్వెన్స్ ని కూడా షూట్‌ చేసినట్లు సమాచారం.

`క్రాక్‌`లో సముద్రఖని క‌ఠారి కృష్ణ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ పాత్ర ఆయ‌న‌ని తెలుగులో మ‌రింత పాపుల‌ర్ అయ్యేలా చేసింది. అదే `స‌ర్కారు వారి పాట‌`లో న‌టించే అవ‌కాశాన్ని అందించింది. ఇందులో స‌ముద్ర‌ఖ‌ని మ‌రింత‌ శక్తివంతమైన విరోధి పాత్రలో క‌నిపించ‌నున్నార‌ట‌. `స‌ర్కారు వారి పాట‌` వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తోంది. `రాధే శ్యామ్` నుండి `భీమ్లా నాయక్` వరకు సంక్రాంతి రేసులో ఉన్న అనేక పెద్ద చిత్రాల‌తో ఈ సంక్రాంతి `స‌ర్కారు వారి పాట‌` కూడా సంద‌డి చేబోతోంది. ఈ మూవీ త‌రువాత మ‌హేష్ SSMB28 చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. దీని షూటింగ్ నవంబర్ లో ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది. మ‌హేష్ 28 తరువాత రాజమౌళి తో మ‌హేష్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను చేయ‌బోతున్నాడు. ఇది ఫారెస్ట్ నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర‌స్ మూవీగా రాబోతోంది.

మ‌హేష్ తో రాజ‌మౌళి భారీ ప్ర‌యోగం?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఇప్ప‌టికే అగ్ర క‌థానాయ‌కులంద‌రితో సినిమాలు చేశారు. ఒక్కరిద్ద‌రు త‌ప్ప‌. అందులో మ‌హేష్ పేరు ముందు వ‌రుస‌లో ఉంది. రాజ‌మౌళితో ప్రాజెక్ట్ పై మ‌హేష్ లో క్యూరియాసిటీ ఉన్నా ఎందుక‌నో ఇన్నాళ్ల వ‌ర‌కూ కుద‌ర‌లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ - ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి కాంబినేష‌న్ లో భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నుందని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక క‌న్ప‌ర్మేష‌న్ లేనే లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ పై రాజ‌మౌళి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్టును రెడీ చేస్తున్నారు.

స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యాకే మహేష్ కానీ రాజ‌మౌళి కానీ అధికారికంగా సినిమాని ప్ర‌క‌టిస్తారు. ఇక‌ ఆ టైమ్ రానుంద‌ని ఇంత‌కుముందు మ‌హేష్ బ‌ర్త్ డే వేళ గుస‌గుస వినిపించింది. జ‌క్క‌న్న‌తో సినిమా అనే విష‌యాన్ని మ‌మేష్ కూడా మ‌న‌సులో దాచుకోలేక‌పోతున్నారు.. ఆగ‌స్టు 9న త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌హేష్ ఈ విష‌యాన్ని అధికారికంగా రివీల్ చేసారు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి కాంబినేషన్ లో చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం రాబోతుంద‌ని వెల్ల‌డించారు. అలాగే ఇది `బాహుబ‌లి` లాంటి భారీ విజువ‌ల్ సినిమా కాద‌ని కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగ‌ని సాధార‌ణ సినిమా కూడా కాదు. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసే స్థాయిలో జ‌క్క‌న్న స్క్రిప్ట్ ఉంటుంద‌ని ప్ర‌చారమైంది. అడ‌వి నేప‌థ్యంలో అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో స్క్రిప్టును తీర్చిదిద్దుతున్నార‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళుతుంద‌న్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.