Begin typing your search above and press return to search.

`రిప‌బ్లిక్`ని `ప్ర‌స్థానం`తో పోల్చిన బాలీవుడ్ మేక‌ర్స్!

By:  Tupaki Desk   |   24 Sep 2021 1:30 PM GMT
`రిప‌బ్లిక్`ని `ప్ర‌స్థానం`తో పోల్చిన బాలీవుడ్ మేక‌ర్స్!
X
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ క‌థానాయ‌కుడిగా దేవ‌క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో `రిప‌బ్లిక్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌మాజం తీరు.. భార‌త రాజ్యాంగాన్ని హైలైట్ చేస్తూ దేవ‌క‌ట్టా త‌న‌దైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ కి మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. తాజాగా ఇటీవ‌లే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఆద్యంతం ఆక‌ట్టుకుంటోంది. ట్రైల‌ర్ కి ఇప్ప‌టికే ఊహించ‌ని ఆద‌ర‌ణ ద‌క్కింది. రిప‌బ్లిక్ ట్రైల‌ర్ పై సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. సాయితేజ్ అభిమానులు ట్రైల‌ర్ కి ఫిదా అయ్యారు. తొలిసారి సాయితేజ్ డిఫ‌రెంట్ కంటెంట్ ఉన్న జోన‌ర్ ని ట‌చ్ చేయ‌డంతో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రాజ్ అండ్ డీకే కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. ``అజ్ఞానం గూడు క‌ట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది`` అనే డైలాగ్ లను ఈ జోడీ షేర్ చేసి ట్రైల‌ర్ పై త‌మ‌దైన శైలిలో స్పందించారు. అప్పుడు ప్రస్థానం... ఇప్పుడు రిప‌బ్లిక్ సూప‌ర్బ్ దేవగారు అంటూ ఆకాశానికి ఎత్తేసారు. సాయితేజ్ త‌న‌లో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడ‌ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా రాజ్ అండ్ డీకేకి దేవ‌క‌ట్టా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌స్థానం చిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. క‌మ‌ర్శియ‌ల్ అంశాన్ని ప‌క్క‌న‌బెట్టి చూస్తూ ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది.

బాలీవుడ్ లోనూ ఈ చిత్రాన్ని దేవ క‌ట్టా రీమేక్ చేసి స‌క్సెస్ అందుకున్నారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు తొలి చిత్రం అదే అయినా ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లతో త‌నదైన‌ మార్క్ వేసారు. ప్ర‌స్థానం చిత్రాన్ని మెచ్చని సినీ ప్రేక్ష‌కుడు లేడు. ఆ ఒక్క స‌క్సెస్ ఆయ‌న‌కు టాలీవుడ్ లో ఎన్నో అవ‌కాశాల్ని తెచ్చి పెట్టింది. స‌మాజం.. మ‌నుషుల ప‌ట్ల ఆయ‌న‌కున్న అవ‌గాహ‌న‌.. పుస్త‌క ప‌ఠ‌నం వంటివి దేవ‌క‌ట్టా ట్యాలెంట్ కి నిద‌ర్శ‌నం. రిపబ్లిక్ తో తిరిగి ప్ర‌స్థానం రేంజు హిట్టు కొట్టి ట్రాక్ లో పడాల‌న్న ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంద‌నే ఆకాంక్షిద్దాం.