Begin typing your search above and press return to search.

యువ హీరో మరణంతో బయటపడుతున్న బాలీవుడ్ డర్టీ సీక్రెట్స్...?

By:  Tupaki Desk   |   24 Sep 2020 3:45 AM GMT
యువ హీరో మరణంతో బయటపడుతున్న బాలీవుడ్ డర్టీ సీక్రెట్స్...?
X
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణం తర్వాత సినీ ఇండస్ట్రీలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా సుశాంత్ సూసైడ్ కి నెపోటిజం కారణమంటూ స్టార్ట్ అయిన ఈ కేసు అనేక మలుపులు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. ఈ క్రమంలో బాలీవుడ్ లోని డర్టీ సీక్రెట్స్ అన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. యువ హీరో ఆత్మహత్యకు బాలీవుడ్ లోని బంధుప్రీతి మరియు ఫేవరిజమ్ కారణమంటూ.. ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనే విషయాన్ని వెల్లడించింది. దీనిపై అనేకమంది సినీ ప్రముఖులు ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. ఈ క్రమంలో అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి వరకు సీబీఐ మరియు ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా కొత్తగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేపట్టింది.

కాగా, సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఆమె సోదరుడిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని విచారిస్తున్న క్రమంలో బాలీవుడ్ లోని డ్రగ్స్ మాఫియా వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎన్‌సీబీ విచారణలో రియా పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల పేర్లను వెల్లడించిందని వార్తలు వచ్చాయి. వారు ఇచ్చిన సమాచారంతో ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా నిర్వహించే పలువురు డ్రగ్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేశారు. అప్పుడు డ్రగ్స్ కేసులో శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్‌ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అదే సమయంలో బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. హీరోయిన్స్ కంగనా రనౌత్ - పాయల్ ఘోష్ వంటి వారు డ్రగ్స్ వ్యవహారంతో పాటు లైంగిక ఆరోపణలను బయటకు తెచ్చారు. ఇందులో నిజానిజాలు తెలియనప్పటికి కొన్ని రోజులుగా డ్రగ్స్ కి క్యాస్టింగ్ కౌచ్ యాడ్ అయింది.

ఇదిలా ఉండగా డ్రగ్స్ వ్యవహారంలో పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఈ క్రమంలోనే ఎన్సీబీ దీపికా పదుకునే మేనేజర్ ని విచారించిందని తెలుస్తోంది. వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ద్వారా ఈ వ్యవహారంలో దీపికా ఇన్వాల్వ్మెంట్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు వస్తున్న వార్తలను నిజం చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే - శ్రద్ధా కపూర్ - సారా అలీఖాన్ - రకుల్ ప్రీత్ సింగ్‌ లకు సమన్లు జారీ చేసిందని నేషనల్ మీడియా వెల్లడించింది. వీరితో పాటు ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా - దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ మరియు సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శ్రుతి మోడీలను కూడా ఎన్సీబీ అధికారులు విచారించబోతున్నట్టు తెలుస్తోంది. రకుల్ - శ్రద్ధ - సారాలను గురువారం.. దీపికను శుక్రవారం విచారణకు రావాల్సిందిగా ఎన్సీబీ ఆదేశించిందని తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో వీరి హస్తం ఉందనేది నిజమో కాదో తెలియనప్పటికీ సుశాంత్ సూసైడ్ తర్వాత బాలీవుడ్ లోని డర్టీ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.