Begin typing your search above and press return to search.

మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హీరోయిన్లు

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:49 PM GMT
మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హీరోయిన్లు
X
బాలీవుడ్ హాట్ భామలు బుక్కయ్యారు. ఈడీ విచారణకు తాజాగా హీరోయిన్లు నోరా ఫతేహికి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు హాజరయ్యారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నోరా ఫతేహిని విచారణకు ఈడీ పిలిచింది. దీంతో ఆమె ఈడీ ఆఫీస్ కు ఈరోజు వెళ్లింది. చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఫతేహిని ఈడీ ఆదేశించింది. సుకేష్ తో నోరా ఫతేహీకి , జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ దృష్టికి వచ్చింది.

ఈ కేసు విచారణలో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు కూడా ఈడీ అధికారులు విచారించారు. మొదట ఈ కేసులో ఆమెను కూడా నిందితులరాలిగానే భావించారు. అయితే విచారణ అనంతరం ఆమె బాధితురాలు మాత్రమేనని తేల్చారు.

చంద్రశేఖర్ తన భార్య లీనా పాల్ ద్వారా జాక్వెలిన్ ను మోసం చేశాడని కనుగొన్నారు. కాగా ఇదే కేసులో నోరా ఫతేహిని కూడా ప్రశ్నిస్తున్నారు.

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను మనీ లాండరింగ్, దోపిడీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే జాక్వెలిన్ ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలతో ఎక్కువగా హైలెట్ అవుతోంది. అయితే ఇదివరకే ఈ బ్యూటీ తనపై వస్తున్న ఆరోపణలపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక ఆమె వివరణ ఇచ్చిన కొన్ని రోజులకే మరోసారి ఈడీ నుంచి నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.

కన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది.. ఫైనాన్షియల్ ప్రోబ్ ఏజెన్సీ ఢిల్లీ యూనిట్ ముందు హాజరు కావాలని అధికారులు జాక్వెలిన్ ను కోరగా..అందుకు ఆమె కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఆమె తనపై వస్తున్న ఆరోపణలు అబద్దమని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తోంది.

200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు సంబంధించిన విచారణను జాక్వెలిన్ ఎదుర్కొంటోంది. అయితే ఈ మనీలాండరింగ్ స్కాంలో జాక్వెలిన్ సూత్రధారిగా హాజరు కాలేదట.. కేవలం ఒక సాక్షిగా బాధితురాలిగా హాజరైందని సమాచారం. ఆ ముఠా చేతిలో మోసపోయిన వారిలో జాక్వెలిన్ కూడా ఒకరని వార్తలు వస్తున్నాయి.

ఈ 200 కోట్ల స్కాంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి సూత్రధారి అని తేలింది. జాక్వెలిన్ తో అతడి గర్ల్ ఫ్రెండ్ పరిచయాన్ని పెంచుకొని ఈమెను స్కాంలోకి లాగారని తెలుస్తోంది. వారి మాయలో పడి జాక్వెలిన్ మోసపోయారని తెలిసింది.