Begin typing your search above and press return to search.

Bigg Boss Winner: చివరలో ఆడపులి ఎమోషనల్

By:  Tupaki Desk   |   21 May 2022 6:30 AM GMT
Bigg Boss Winner: చివరలో ఆడపులి ఎమోషనల్
X
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో అయితే ఆడియన్స్ పెద్దగా సంతృప్తి చెందలేదు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. కానీ కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం చాలా తక్కువ కాలంలోనే ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు.

అందులో బిందుమాధవి ఒకరు. ఆమెనే ఫైనల్ విన్నర్ అని ఆడియెన్స్ అయితే పసిగట్టేశారు. బిందు ఆడపులిగా తన కంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఒక స్పెషల్ జర్నీ వీడియో చూపిస్తూ వస్తున్నారు. ఇక టాప్ 7లో ఉన్న వారిలో అందరికంటే చివరగా బిందుమాధవి జర్నీ వీడియో చూపించడం జరిగింది.


చివరలో వచ్చినప్పటికీ కూడా బిందుమాధవి వీడియో ప్రతి ఒక్కరికీ చాలా బాగా కనెక్ట్ అయి పోయింది. ఆమె మొదట ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయిన విధానం అలాగే నట్రాజ్ మాస్టర్ తో గొడవలు అఖిల్ కు వార్నింగ్ ఇవ్వడం అలాగే యాంకర్ శివతో తో సరదాగా ఉండటం.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా హైలెట్ చేస్తూ వచ్చారు. అమ్మోరు తరహాలో ఆమె స్టిల్ స్టిచ్చింగ్ విధానం కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

82 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బిందుమాధవి తన జర్నీని చూసి మోషనల్ అయ్యింది. ఎక్కువగా మహిషాసుర మర్దిని స్టిల్ తోనే షాక్ ఇచ్చింది. నటరాజ్ తో చేసిన ఫైట్ ఆమె జర్నీనిలో మేజర్ హైలెట్ పాయింట్ గా నిలిచింది. ఇక ఆడపులి అంటూ బిగ్ బాస్ మంచి బిరుదు ఇచ్చారు. బిందు ఏంటో ప్రపంచానికి చూపించడానికి ఈ ఇంట్లో అడుగుపెట్టారు అంటూ.. యుద్ధంలో ఒంటరిగానే పోరాడారని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. మీకున్న స్పష్టతే మీ ప్రధాన ఆయుధం అని.. మిమ్మల్ని తేలికగా తీసుకున్నవాళ్లు మీ విలువను తెలుసుకున్నారని అన్నారు.

ఇక మీ నవ్వు అందర్నీ నవ్వించిందని.. బాధలో ఉన్న అర్ధం కూడా అందరికీ తెలిసివచ్చిందని బిగ్ బాస్ తెలియజేశారు. ఇక మిగతా ప్రత్యుర్ధులపై మీరు విరుచుకుపడే ఆట విధానంతోనే మీకు ఆడపులి అనే పేరుని తీసుకుని వచ్చిందని అన్నారు. ముఖ్యంగా మీలోని ఉగ్రరూపాన్ని మాత్రమే అందరూ చూశారుని.. మౌనంగా మీరు కార్చిన కన్నీళ్లను బిగ్ బాస్ గమనించారని చెప్పడంతో బిందు ఎమోషనల్ అయ్యింది.

అందరూ కూడా మిమ్మల్ని టాప్ 5లో చూసేందుకు ఇష్టపడ్డారు అంటూ అందుకు మీరు నిజమైన అర్హులను బిగ్ తెలియజేశారు. చివరలో సముద్రం కూడా తన ప్రస్థానం ఒక నీటి బిందువుతోనే మొదలుపెడుతుందని.. కానీ మీ ప్రస్థానం సముద్రమంత ఎత్తుకు ఎదగాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారని చెప్పడంతో బిందుమాధవి జర్నీ చాలా హైలెట్ అనిపించింది.