Begin typing your search above and press return to search.

బన్నీ చెప్పేసాడు సరే.. మరి చెర్రీ సంగతేంటి...?

By:  Tupaki Desk   |   1 Aug 2020 10:10 AM GMT
బన్నీ చెప్పేసాడు సరే.. మరి చెర్రీ సంగతేంటి...?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఆర్.ఆర్.ఆర్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించబోయే ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు. కాకపోతే హోమ్ ప్రొడక్షన్ లో చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మధ్య స్టార్ హీరోలందరూ వరుసపెట్టి న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్న తరుణంలో చరణ్ నెక్స్ట్ మూవీ ఏమిటని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. అప్పట్లో వీరి కాంబోలో ఓ సినిమాకి క్లాప్ కొట్టినప్పటికీ పట్టాలెక్కలేదు. దీంతో కొరటాల శివ 'ఆచార్య' తర్వాత చెర్రీ తోనే సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే కొరటాల శివ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు చరణ్ నెక్స్ట్ మూవీ ఏంటనే సందేహం అభిమానుల్లో మొదలైంది.

కాగా రామ్ చరణ్ కి ఇప్పటికే స్క్రిప్ట్స్ రెడీ చేసిన డైరెక్టర్స్ లిస్టులో వంశీ పైడిపల్లి - వెంకీ కుడుముల - సురేందర్ రెడ్డి ఉన్నారని సమాచారం. 'భీష్మ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల తనశైలిలో ఓ స్క్రిప్ట్ వినిపించాడని వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా ఓకే కాకపోవడంతో చరణ్ దగ్గరకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబోలో 'ఎవడు' హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరితో పాటు చరణ్ కి 'ధ్రువ' వంటి సూపర్ హిట్ అందించిన సురేందర్ రెడ్డి కూడా లైన్లో ఉన్నాడు. ఈ ముగ్గురు దర్శకులు కూడా తదుపరి సినిమాలను ప్రకటించకుండా వెయిట్ చేస్తున్నారు. దీంతో వీరిలో ఒకరికి చరణ్ అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. మెగా కంపౌండ్ నుండి బన్నీ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసాడు.. ఇక చెర్రీ ఎప్పుడు తదుపరి సినిమా వివరాలు వెల్లడిస్తారో అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.