Begin typing your search above and press return to search.

మరో పెద్ద రీమేక్ ఓటీటీలో రిలీజ్‌!

By:  Tupaki Desk   |   29 Sep 2020 11:30 AM GMT
మరో పెద్ద రీమేక్ ఓటీటీలో రిలీజ్‌!
X
సౌత్‌ లో సూపర్‌ హిట్‌ అయిన కాంచన సినిమాను హిందీలో అక్షయ్‌ కుమార్‌ లక్ష్మీబాంబ్‌ పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఈజీగా 150 కోట్ల వసూళ్లు చేస్తుందని మేకర్స్‌ మరియు హీరో అభిమానులు భావించారు. కాని థియేటర్ల ఓపెన్‌ ఆలస్యం అవుతూ ఉండటంతో పాటు ఇతరత్ర కారణాల వల్ల సినిమాను నేరుగా ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ఓటీటీ కూడా భారీ రేటును ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అందుకే విడుదలకు రెడీ అయ్యారు అనే టాక్‌ వినిపిస్తుంది. ఈ సమయంలో మరో సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగులో అనుష్క నటించిన 'భాగమతి' సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన అశోక్‌ హిందీలో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. భూమీ పడ్నేకర్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆరు నెలల పాటు నిలిచి పోయింది. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి డైరెక్ట్‌ గా ఓటీటీ లో విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్‌ సభ్యులు వచ్చారంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ సినిమాకు భారీ మొత్తాన్ని పెట్టేందుకు సిద్దంగా ఉందట. ఈ సినిమాకు అక్షయ్‌ కుమార్‌ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం.