Begin typing your search above and press return to search.
కసిగా ఉన్న శీను ఇక్కడ ఏదీ ముట్టుకోడట
By: Tupaki Desk | 22 Jan 2021 7:13 AM GMTటాలీవుడ్ లో బెస్ట్ డెబ్యూ హీరో ఎవరు? అన్నది లెక్కలు తీస్తే.. తొలిగా వినిపించే పేరు ఏ అగ్ర హీరో వారసుడో అనుకుంటే పొరపాటే... రామ్ చరణ్ కంటే ఘనమైన ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు బెల్లంకొండ శ్రీను. తన పరిధికి మించి లావిష్ సెట్లు.. భారీ పెట్టుబడి.. ఎవరికీ దొరకని క్రేజీ స్టార్ డైరెక్టర్ అతడిని లాంచ్ చేయడంతో ఆ తర్వాత అతడి కెరీర్ పరంగా వెనుదిరిగి చూసే పనే లేకుండా పోయింది.
ప్రస్తుతం పరిశ్రమలో జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న యువహీరోగా బెల్లకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ శ్రీను పేరు మార్మోగుతోంది. యాక్షన్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకున్న శ్రీను .. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నందున అతడి పేరు ఉత్తరాదినా మార్మోగుతుందన్న అంచనా ఉంది.
తనని అల్లుడు శీనుగా ఇంట్రడ్యూస్ చేసిన వీవీ వినాయక్ అతడి బాలీవుడ్ డెబ్యూకి దర్శకత్వం వహించే బాధ్యతను స్వీకరించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో సాగుతోంది. అల్లుడు అదుర్స్ సంక్రాంతి బరిలో రిలీజ్ చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీపైనే దృష్టి సారించాడని తెలిసింది. అయితే ఇప్పటివరకూ మరో తెలుగు చిత్రానికి సంతకం చేయకపోవడానికి కారణాలపైనా మాటా మంతీ సాగుతోంది.
ఓ ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. శ్రీను తన బాలీవుడ్ అరంగేట్రం పూర్తయ్యేవరకూ వేరొకటి ముట్టుకోడట. ఏ తెలుగు చిత్రానికి సంతకం చేయడట. బాలీవుడ్ డెబ్యూని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే అతడు వేరొక ఆలోచన చేయడం లేదని తెలిసింది. హిందీ ఆడియెన్ కి తగ్గట్టు తనను తాను సర్వం సిద్ధం చేసుకోవాలని తన బిగ్ డ్రీమ్ ని సజావుగా నెరవేర్చుకోవాలని భావిస్తున్నాడు. అతను బాలీవుడ్ లో నిరూపించుకోవాలన్న కసితో ఉన్నాడని సమాచారం రివీలైంది.
ప్రస్తుతం పరిశ్రమలో జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న యువహీరోగా బెల్లకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ శ్రీను పేరు మార్మోగుతోంది. యాక్షన్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకున్న శ్రీను .. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నందున అతడి పేరు ఉత్తరాదినా మార్మోగుతుందన్న అంచనా ఉంది.
తనని అల్లుడు శీనుగా ఇంట్రడ్యూస్ చేసిన వీవీ వినాయక్ అతడి బాలీవుడ్ డెబ్యూకి దర్శకత్వం వహించే బాధ్యతను స్వీకరించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో సాగుతోంది. అల్లుడు అదుర్స్ సంక్రాంతి బరిలో రిలీజ్ చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీపైనే దృష్టి సారించాడని తెలిసింది. అయితే ఇప్పటివరకూ మరో తెలుగు చిత్రానికి సంతకం చేయకపోవడానికి కారణాలపైనా మాటా మంతీ సాగుతోంది.
ఓ ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం.. శ్రీను తన బాలీవుడ్ అరంగేట్రం పూర్తయ్యేవరకూ వేరొకటి ముట్టుకోడట. ఏ తెలుగు చిత్రానికి సంతకం చేయడట. బాలీవుడ్ డెబ్యూని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లనే అతడు వేరొక ఆలోచన చేయడం లేదని తెలిసింది. హిందీ ఆడియెన్ కి తగ్గట్టు తనను తాను సర్వం సిద్ధం చేసుకోవాలని తన బిగ్ డ్రీమ్ ని సజావుగా నెరవేర్చుకోవాలని భావిస్తున్నాడు. అతను బాలీవుడ్ లో నిరూపించుకోవాలన్న కసితో ఉన్నాడని సమాచారం రివీలైంది.