Begin typing your search above and press return to search.

థియేటర్లలోనే 'బెల్ బాటమ్'.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అక్షయ్..!

By:  Tupaki Desk   |   15 Jun 2021 9:40 AM GMT
థియేటర్లలోనే బెల్ బాటమ్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అక్షయ్..!
X
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ నటించిన లేటెస్ట్ మూవీ ''బెల్‌ బాటమ్‌''. 1980లో జరిగిన వాస్తవ సంఘటలన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో అక్షయ్ 'రా' ఏజెంట్ గా కనిపించనున్నారు. వాణీ కపూర్‌ - హ్యూమా ఖురేషి - లారాదత్తా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా దేశవ్యాప్తంగా థియేటర్లు మూత‌ప‌డ‌టంతో 'బెల్‌ బాటమ్‌' చిత్రం డైరెక్ట్ ఓటీటీ విధానంలో డిజిటల్ రిలీజ్ కానుందంటూ జోరుగా ప్ర‌చారం సాగింది. ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్ కుదుర్చుకున్నారని.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా అక్షయ్ కుమార్ అలాంటి రూమర్స్ కు చెక్ పెట్టాడు. అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బెల్‌ బాటమ్‌' సినిమాని థియేట‌ర్లలోనే విడుద‌ల చేస్తున్న‌ట్టు ట్విట్టర్ వేదిక‌గా అక్కీ వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

'బెల్‌ బాటమ్‌' చిత్రాన్ని జులై 27న వరల్డ్ వైడ్ బిగ్ స్క్రీన్స్ పై రిలీజ్ చేయనున్నట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. దీనిని బట్టి అప్పటికి థియేటర్లు తెరుచుకుని సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మేకర్స్ ధీమాగా ఉన్నట్లు అర్థం అవుతోంది. కాగా, ఈ చిత్రానికి రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వం వహించారు. పూజా ఎంటర్టైన్మెంట్ మరియు ఎమ్మా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వషూ భగ్నానీ - జాకీ భగ్నానీ - దీప్షికా దేశ్‌ముఖ్ - మోనీషా అద్వానీ - మధు భోజ్వానీ - నిఖిల్ అద్వానీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గతేడాది ఓటీటీలో విడుదలైన 'లక్ష్మీబాంబ్' సినిమాతో పలకరించిన అక్షయ్.. 'బెల్ బాటమ్' తో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.