Begin typing your search above and press return to search.
వీరసింహుని విజయోత్సవంలోనూ ప్రభుత్వంపై అవే పంచ్ లు?
By: Tupaki Desk | 23 Jan 2023 10:57 AM GMTనందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సంక్రాంతి సీజన్ ను ఫుల్ గా వినియోగించుకున్న బాలయ్య భారీగానే రాబట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా యొక్క విజయాన్ని పురష్కరించుకుని వీరసింహుని విజయోత్సవం అంటూ ఒక సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
సక్సెస్ మీట్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్ మరియు డీజే టిల్లు ఫేమ్ సిద్దు లు హాజరు అయ్యారు. ఈ విజయోత్సవ వేడుకలో బాలయ్య చాలా యాక్టివ్ గా కనిపించారు. హీరోయిన్స్ తో కొంటె సరసాలు మొదలుకుని అభిమానులను అలరించే విధంగా పలు యాక్ట్ లు చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ మరోసారి ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేశారు.
వీర సింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ప్రభుత్వాలపై పంచ్ డైలాగ్స్ పేల్చిన విషయం తెల్సిందే. ట్రైలర్ లోనే ప్రభుత్వం పై పంచ్ లు వేసి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. సినిమా విడుదల అయిన తర్వాత కూడా బాలయ్య ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
తాజా కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. దర్శకుడు గోపీచంద్ మలినేని నా అభిమాని.. నా సమరసింహారెడ్డి సినిమాను చూసేందుకు వెళ్లి దెబ్బలు తిన్నాడు. అప్పటి కారణం ఏంటో చెబితే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేస్తారు. కేసులు బుక్ చేయడం ఇప్పుడు చాలా తేలిక కదా అన్నట్లుగా కామెంట్ చేశాడు.
బాలకృష్ణ పరోక్షంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు అనేది అందరూ అనుకునే మాట. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.
రెండవ షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా వరకు సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
సక్సెస్ మీట్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్ మరియు డీజే టిల్లు ఫేమ్ సిద్దు లు హాజరు అయ్యారు. ఈ విజయోత్సవ వేడుకలో బాలయ్య చాలా యాక్టివ్ గా కనిపించారు. హీరోయిన్స్ తో కొంటె సరసాలు మొదలుకుని అభిమానులను అలరించే విధంగా పలు యాక్ట్ లు చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ మరోసారి ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేశారు.
వీర సింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ప్రభుత్వాలపై పంచ్ డైలాగ్స్ పేల్చిన విషయం తెల్సిందే. ట్రైలర్ లోనే ప్రభుత్వం పై పంచ్ లు వేసి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. సినిమా విడుదల అయిన తర్వాత కూడా బాలయ్య ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
తాజా కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. దర్శకుడు గోపీచంద్ మలినేని నా అభిమాని.. నా సమరసింహారెడ్డి సినిమాను చూసేందుకు వెళ్లి దెబ్బలు తిన్నాడు. అప్పటి కారణం ఏంటో చెబితే ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేస్తారు. కేసులు బుక్ చేయడం ఇప్పుడు చాలా తేలిక కదా అన్నట్లుగా కామెంట్ చేశాడు.
బాలకృష్ణ పరోక్షంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు అనేది అందరూ అనుకునే మాట. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.
రెండవ షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా వరకు సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.