Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బాలయ్య...!

By:  Tupaki Desk   |   2 Jun 2020 6:30 AM GMT
కేసీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బాలయ్య...!
X
గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ పెద్దలపై ఘాటైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య తన పర్సనల్ లైఫ్ గురించి.. సినీ రాజకీయాలకు సంభందించిన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బాలయ్య. త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు అంటే కేసీఆర్‌ గారికి ఎంతో అభిమాన‌మ‌ని.. ఆ అభిమానంతోనే త‌న‌పై పుత్ర వాత్సల్యం చూపిస్తారని అన్నారు బాల‌య్య‌. ఇటీవల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మరియు సీఎం కేసీఆర్ తో సమావేశమయమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు బాలయ్యని పిలవకపోవడంతో ఆయన అసహనానికి గురయ్యారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు.

కాగా ఇప్పుడు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సదరు యాంకర్ ''చిరంజీవి మరియు నాగార్జున వెళ్లి కేసీఆర్ గారిని కలిశారు. దానికి కూడా మిమ్మల్ని పిలవలేదు. అంటే మీరు గతంలో కేసీఆర్ గారి మీద విమర్శలు చేశారు. బహుశా మిమ్మల్ని పిలవకపోవడానికి ఇదే కారణమంటారా..?'' అని బాలకృష్ణను ప్రశ్నించగా.. దీనికి బాలయ్య సమాధానం ఇస్తూ ''ఆ విషయం చెప్పొచ్చుగా నాకు. కేసీఆర్ గారికి ఆ విషయంలో నా మీద ఎప్పుడూ కోపం లేదు. అయినా అది రాజకీయమండి. మా నామా నాగేశ్వరరావుని వారి పార్టీలో జాయిన్ చేసుకోలేదా. ఆయన ఎన్ని తిట్లు తిట్టాడో తెలుసుగా. రాజకీయాలు వేరండి. అందుకే అనేది హిపోక్రసి సైకోఫాన్సీ అని. నన్ను వేరేగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుద్ది'' అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా కేసీఆర్ గారికి తనపై అలాంటి అభిప్రాయం ఏమీ లేదని.. రామారావు గారి అభిమానిగా ఆయనకి నాపైన పుత్ర వాత్సల్యం ఉందని.. మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదని బాలయ్య చెప్పుకొచ్చారు. మరి ఆయనతో సమావేశానికి తనను ఎందుకు పిలవలేదో తనకు తెలీదని అన్నారు. మొత్తం మీద కేసీఆర్ పట్ల తన అభిప్రాయాన్ని చెప్పిన బాలయ్య తాను చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ పెద్దల మీదే అని స్పష్టం అయింది.