Begin typing your search above and press return to search.

మా వాళ్లు ఎవరు ఆ విషయం అడగడం లేదు : అనుష్క

By:  Tupaki Desk   |   5 Aug 2020 1:00 PM GMT
మా వాళ్లు ఎవరు ఆ విషయం అడగడం లేదు : అనుష్క
X
టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కల జోడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. వారిద్దరు ఇండియాలోనే మోస్ట్‌ ట్రెండింగ్‌ కపుల్‌ గా చెప్పుకోవచ్చు. వారికి సంబంధించిన ఏదో ఒక విషయం నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటుంది. పెళ్లి అయినప్పటి నుండి వారు ఒక్క చోట కలిసి నెల రోజులు కూడా ఉన్నది లేదు. కాని కరోనా కారణంగా గత అయిదు నెలలుగా వారు కలిసే ఉంటున్నారు. ఈ సమయంలో వారు పూర్తిగా సమయంను ఒకరి కోసం ఒకరు కేటాయించుకున్నారు.

అనుష్క బర్త్‌ డే సందర్బంగా స్వయంగా కోహ్లీ కేక్‌ తయారు చేయడం నుండి మొదలుకుని ఇద్దరి సరదా ముచ్చట్ల వరకు సోషల్‌ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనుష్క సోషల్‌ మీడియాలో లైవ్‌ చాట్‌ చేసింది. ఆ సందర్బంగా విరాట్‌ కోహ్లీ గురించిన పలు ప్రశ్నలు అనుష్కను అడగడం జరిగింది. కోహ్లీకి ఓటమి అంటే చిరాకు అని బోర్డ్‌ గేమ్స్‌ లో అతడిని ఎప్పుడైనా ఓడిస్తే అతడు చిరాకు పడేలా చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.

ఇక ఎప్పటిలాగే ఈ లైవ్‌ చాట్‌ సెషన్‌ లో కూడా పిల్లల విషయం ప్రస్థావన రావడంతో అనుష్క చిరాకు పడినది. మీ చుట్టు ఉన్న వారు ఇంట్లో వారు మీ పిల్లల గురించి ప్రశ్నించడం లేదా అంటూ ఒక నెటిజన్‌ అడిగిన సందర్బంగా అనుష్క స్పందిస్తూ నేను నా కుటుంబ సభ్యుల నుండి ఎప్పుడు కూడా ఆ ప్రశ్నను ఎదుర్కోవడం లేదు. ఎప్పుడు కూడా నెటిజన్స్‌ ఆ ప్రశ్నను అడిగి చిరాకు పెడుతున్నారు అంటూ సమాధానం ఇచ్చింది. పిల్లల విషయమై ఇప్పుడే ఏం ప్లాన్‌ చేయడం లేదని గతంలో ఒక లైవ్‌ ఛాట్‌ సందర్బంగా అనుష్క క్లారిటీ ఇచ్చింది.