Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాపై అనుష్క క్లారిటీ ఇచ్చేసింది...!

By:  Tupaki Desk   |   29 Sep 2020 3:30 PM GMT
ప్రభాస్ సినిమాపై అనుష్క క్లారిటీ ఇచ్చేసింది...!
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ మూవీలో 'డార్లింగ్‌' ప్రభాస్‌ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణుడుగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో సీత పాత్రలో ఎవరు నటిస్తారనేది చర్చనీయాంశం అయింది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రాగా.. కియారా అద్వానీ - కీర్తి సురేష్‌ - అనుష్క శర్మ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్ అనుష్క కూడా సీత పాత్ర జాబితాలో చేరిపోయింది.

అయితే తాజాగా అనుష్క ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఆదిపురుష్‌' సినిమాలో సీత పాత్రపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ''నాకు అటువంటి ఆఫర్‌ ఏమీ రాలేదు. నేను ఆ మూవీలో నటించడం లేదు" అని అనుష్క తెలిపారు. అంతేకాకుండా తాను ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' సినిమా అక్టోబర్‌ 2న ఓటీటీలో విడుదల అవుతుందటంతో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఎక్సయిటింగ్ గా ఎదురు చూస్తున్నాని చెప్పుకొచ్చింది. అనుష్క వివరణతో 'ఆదిపురుష్‌' లో సీత పాత్రలో నటించడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. దీంతో 'బిల్లా' 'మిర్చి' 'బాహుబలి' 'బాహుబలి 2' చిత్రాల తర్వాత మరోసారి ప్రభాస్ - అనుష్క జోడీని తెరపై చూడాలనుకున్న ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.