Begin typing your search above and press return to search.

#రాధేశ్యామ్.. టైమ్ ట్రావెల్ ల‌వ్ స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు!

By:  Tupaki Desk   |   27 July 2021 12:30 AM GMT
#రాధేశ్యామ్.. టైమ్ ట్రావెల్ ల‌వ్ స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు!
X
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్-పూజాహెగ్గే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `రాధేశ్యామ్` పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో ఎక్క‌డా రాజీ లేకుండా నిర్మిస్తోంది. 1980ల‌లో యూర‌ప్ నేప‌థ్యంలో సాగే రొమాంటిక్ ల‌వ్ స్టోరి మెస్మ‌రైజ్ చేయ‌నుంద‌ని ఇప్ప‌టికే రివీల్ అయింది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్ష‌న్ స‌న్నివేశాల్ని అంతే హైలైట్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. పాన్ ఇండియా రిలీజ్ ఉన్నా హైప్ ని కాస్త త‌గ్గించే ప్ర‌య‌త్న‌మే జ‌రుగుతోంది.

ఈ సినిమా రిలీజ్ కి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో అభిమానుల్లో అంచ‌నాలు త‌గ్గ‌కుండా మ‌రో ఆస‌క్తిక‌ర అప్ డేట్ లీక్ అయింది. ఇది టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలోని మూవీ అని ..ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ట్విస్టుల‌తో ఎంతో అందంగా మ‌లుస్తున్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఆ కాలం నాటి రిచ్ యూరోపియ‌న్ స్టైల్ రైలు బండిలో చిత్రీక‌రించార‌ని..సినిమాలో ర‌న్నింగ్ ట్రైన్ లో ల‌వ్ ఎపిసోడ్స్ ఎంతో అందంగా క‌నిపిస్తాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ్ లోనే ఓ రైల్వేస్టేష‌న్ చూపించారు. తాజాగా రిలీజ్ అయిన కొత్త పోస్ట‌ర్ లో ప్ర‌భాస్- పూజా హెగ్డే జంట‌ రైలు లో విర‌హా గీతం పాడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ పోస్ట‌ర్ ని బ‌ట్టి రాధేశ్యామ్ అద్భుత‌మైన‌ రొమాంటిక్ డ్రామా అని మ‌రోసారి క్లారిటీ వ‌చ్చింది. ఇందులో ప్ర‌భాస్ 1980 కాలం నాటి వింటేజ్ కార్ల డీల‌ర్ పాత్రలో క‌నిపించ‌నున్నారు. క్యారెక్ట‌రైజేష‌న్ లో సీరియ‌స్ నెస్ తో పాటు ఫ‌న్ ఎలిమెంట్ అంతే హైలైట్ గా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇంకా అత‌ని పాత్ర‌లో చాలా వేరియ‌ష‌న్స్ ఉంటాయ‌ని... పూజా హెగ్డే రోల్ మాత్రం చాలా సెటిల్డ్ గా సాగిపోతుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. అయితే ప్ర‌చారంలో ఉన్నంతా ఉందా మ్యాట‌ర్ ఎంత‌? అన్న‌దానిపై రిలీజ్ త‌ర్వాతే క్లారిటీ వ‌స్తుంది.

బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాల‌తో బిజీ

రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణ ఆల్మోస్ట్ పూర్తి చేసిన డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అతడి కోసం ఒక్కో సినిమాకి వంద‌ల కోట్ల పెట్టుబ‌డులతో తెర‌కెక్కుతున్న‌వే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న వాటిలో నువ్వా నేనా? అంటూ ఒక‌దానిని మించి ఒక‌టి సెట్స్ పై ఉన్నాయి. రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ కావాల్సి ఉంది. ఓం రౌత్- ఆదిపురుష్ 3డి.. ప్ర‌శాంత్ నీల్- స‌లార్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఇవ‌న్నీ పూర్త‌యి రిలీజ్ చేసేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. వీటితో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ఇటీవ‌ల లాంచ్ అయ్యింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ - దీపిక ప‌దుకొనే వంటి టాప్ స్టార్లు న‌టిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. భారీ కాన్వాసుతో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో అశ్వ‌నిద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

ఇంత భారీ షెడ్యూల్ న‌డుమ ప్ర‌భాస్ అటు బాలీవుడ్ లో స్థిర‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మ‌రో ప్ర‌చారం వేడెక్కిస్తోంది. వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్ర‌భాస్ సంత‌కం చేశార‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. అలాగే య‌ష్ రాజ్ ఫిలింస్ ధూమ్ 4 కోసం ప్ర‌భాస్ ని సంప్ర‌దించింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.