Begin typing your search above and press return to search.

త‌మ‌న్నాకు మ‌రో పాన్ ఇండియా ఆఫ‌ర్

By:  Tupaki Desk   |   20 Jun 2021 4:30 AM GMT
త‌మ‌న్నాకు మ‌రో పాన్ ఇండియా ఆఫ‌ర్
X
ద‌శాబ్ధం పైగానే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన‌ మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా ఇటీవ‌ల వెబ్ సిరీస్ లు సినిమాల‌తో ఇంకా బిజీ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. న‌టిగా త‌న స్థాయిని పెంచుకునేందుకు త‌మ‌న్నా తెలివైన ఎంపిక‌ల‌తో ముందుకు సాగుతోంది.

ఇంత‌కుముందు బాహుబ‌లి లాంటి పాన్ ఇండియా చిత్రంలో న‌టించింది. ఆ వెంట‌నే మ‌రో పాన్ ఇండియా మూవీ సైరా న‌ర‌సింహారెడ్డిలో నట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో న‌టించింది. ఇప్పుడు అదే క్రేజుతో య‌ష్ స‌ర‌స‌న మ‌రో పాన్ ఇండియా మూవీలో న‌టించ‌నుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

రాకింగ్ స్టార్ య‌ష్ కేజీఎఫ్ 2 త‌ర్వాత క‌న్న‌డ ద‌ర్శ‌కుడు నార్త‌న్ తెర‌కెక్కించే భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో న‌టించ‌నున్నాడు. ఇది ఆర్మీ నేప‌థ్యంలో సాగే సినిమా. ఇందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. య‌ష్ న‌టించిన కేజీఎఫ్ లో అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ తో దుమ్మురేపిన త‌మ‌న్నాకు ఇప్పుడు క్రేజీగా అదే హీరోతో ఛాన్స్ అన్న ప్ర‌చారం హోరెత్తుతోంది. అయితే త‌మ‌న్నా తో ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. అధికారికంగా క‌న్ఫామ్ చేయాల్సి ఉంది. త‌దుప‌రి మిల్కీ బ్యూటీ సౌత్ లో క్రేజీ చిత్రాల్లో న‌టించేందుకు ప్లాన్ చేస్తోంద‌ట‌. గుర్తుందా శీతాకాలం- ఎఫ్ 3 చిత్రాల‌తోనూ త‌మ‌న్నా బిజీగా ఉంది.