Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్-రవితేజల భారీ మల్టీస్టారర్.. కొత్త స్టోరీతో రానుందా..?

By:  Tupaki Desk   |   15 Jun 2020 6:50 AM GMT
పవన్ కళ్యాణ్-రవితేజల భారీ మల్టీస్టారర్.. కొత్త స్టోరీతో రానుందా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ రాజా రవితేజ ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉన్నారు. వరుసపెట్టి ప్రాజెక్టులను ఓకే చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ బిజీగా ఉండగా ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'విరూపాక్ష'.. హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తున్నారు. ఇక మాస్ రాజా ప్రస్తుతం క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావుతో.. రమేష్ వర్మతో.. వక్కంతం వంశీలతో సినిమాలు చేయనున్నాడు. వరుస సినిమాలతో ఈ ఇద్దరు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ - రవితేజ మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టినట్టు ఇండస్ట్రీ టాక్. డైరెక్టర్ డాలీ (కిషోర్ కుమార్ పార్ధసాని) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతానికి ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక పుకారు మాత్రమే అని అందరూ అనుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ఓ ప్రాజెక్ట్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాల టాక్. కానీ మొన్నటి వరకు డైరెక్టర్ డాలీ ఒక తమిళ రీమేక్ సబ్జెక్ట్ మీద పనిచేస్తున్నారని తెలిసింది. డాలీ రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ అని తెలిసిందే. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన డాలీ.. ఆ తరవాత తడాఖా.. గోపాల గోపాల.. కాటమరాయుడు సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పటికే పవన్‌తో రెండు సార్లు పనిచేసిన డాలీ.. ఈసారి ఇద్దరు హీరోలను కలిపి వారికోసం మరో కొత్త సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. ఇదివరకే డాలి.. బోగన్.. విక్రమ్ వేదలను ప్లాన్ చేసాడట కానీ ఏవి వర్కౌట్ కావని కొత్త లైన్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మల్టీస్టారర్ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించనున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు మరి వెయిట్ చేయాల్సిందే.