Begin typing your search above and press return to search.

రజినీ తర్వాత కమల్‌.. సూర్య.. కార్తీలు రాబోతున్నారు

By:  Tupaki Desk   |   17 Jun 2021 8:30 AM GMT
రజినీ తర్వాత కమల్‌.. సూర్య.. కార్తీలు రాబోతున్నారు
X
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తాజా చిత్రం అన్నాత్తే మెజార్టీ పార్ట్‌ హైదరాబాద్‌ లోనే చిత్రీకరించారు. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు హైదరాబాద్ లోని ఐకియా షో రూమ్‌ ఇంకా శివారు ప్రాంతాల్లో షూటింగ్‌ ను నిర్వహించారు. షూటింగ్ లకు చాలా అనుకూలమైన ప్రాంతంగా హైదరాబాద్‌ ను తమిళ ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. రజినీకాంత్‌ కు ముందు అజిత్ కూడా తన తాజా సినిమా కోసం ఏకంగా రెండు నెలలు రామోజీ ఫిల్మ్‌ సిటీ మరియు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేసిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు కమల్‌ హాసన్‌.. సూర్య మరియు కార్తీలు కూడా హైదరాబాద్ లో షూటింగ్‌ కు రాబోతున్నారు.

కమల్‌ హాసన్ తాజా చిత్రం విక్రమ్‌ షూటింగ్‌ ను వచ్చే నెల ఆరంభం నుండి హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభించబోతున్నట్లుగా మేకర్స్‌ చెప్పుకొచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మాస్టర్ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. లోకేష్ కనగరాజ్ సినిమాకు సంబంధించిన మెజార్టీ పార్ట్‌ సన్నివేశాలను హైదరాబాద్‌ లోనే ప్లాన్‌ చేశాడని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కమల్‌ గతంలో పలు సార్లు హైదరాబాద్‌ లో షూటింగ్‌ ల్లో పాల్గొన్నాడు.

కమల్‌ తో పాటు సూర్య మరియు కార్తలు కూడా వారి వారి సినిమా ల కోసం హైదరాబాద్‌ రాబోతున్నారు. వారి సినిమాల షెడ్యూల్‌ అనుసారంగా ఆ ఇద్దరు హీరోలు కూడా మూడు నుండి అయిదు వారాల పాటు హైదరాబాద్‌ లోనే ఉంటారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు తమిళ హీరోలు కూడా వారి సినిమాల కోసం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీకి వస్తారు. బాలీవుడ్ స్టార్‌ హీరోలు సైతం హైదరాబాద్‌ లో సినిమా షూటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. సినిమాల మేకింగ్ విషయంలో హైదరాబాద్‌ చాలా అనుకూలంగా ఉంటుందని అందరి అభిప్రాయం.