Begin typing your search above and press return to search.

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో పార్టిసిపేట్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   24 Nov 2020 4:10 PM GMT
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్..!
X
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' విస్తృతంగా కొనసాగుతోంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న ఈ ఛాలెంజ్ మూడో దశకు చేరుకుంది. సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజానీకం వరకు అందరూ ఈ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవుతున్నారు. మొక్కలు నాటడంతో పాటు ఇతరులను నామినేట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో పార్టిసిపేట్ చేశాడు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి 'గాలి సంప‌త్' సెట్‌ లో హీరో శ్రీ విష్ణు - నటకిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌ - ప్రొడ్యూసర్ ఎస్ కృష్ణ‌ మరియు టీమ్ తో కలిసి మొక్క‌లు నాటారు. బర్త్ నాడు మొక్కలు నాటి దీంట్లో పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉందని.. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఇంత మంచి కార్య‌క్ర‌మంలో తనని కూడా భాగస్వామ్యం చేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కి కృత‌జ్ఞ‌త‌లు అని అనిల్ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. దీనికి జోగినపల్లి సంతోష్‌కుమార్‌ స్పందిస్తూ మొక్కలు నాటినందుకు అనిల్ రావిపూడి కి థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు.

కాగా, అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం 'ఎఫ్ 3' స్క్రిప్ట్ ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. అలానే త‌న స్నేహితుడు ఎస్ కృష్ణ తో షైన్‌ స్క్రీన్‌ సాహు గారపాటి - హరీష్‌ పెద్దితో కలిసి 'గాలి సంపత్‌' సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి మెంటర్ గా వ్యవహరించడమే కాకుండా స్క్రీన్‌ ప్లే ను అందిస్తున్నాడు.