Begin typing your search above and press return to search.
మోలీవుడ్ లోకి అనసూయ ఎంట్రీ.. టాప్ హీరో సినిమాలో ఛాన్స్!
By: Tupaki Desk | 21 Feb 2021 6:24 AM GMTయాంకర్ అనసూయ అని కాకుండా.. సినీనటి అనసూయ అని పిలవాల్సిన సమయం వచ్చేసినట్టే కనిపిస్తోంది. బుల్లితెరపై అద్భుతమైన టాలెంట్ తో సత్తాచాటుతున్న అనసూయ.. ఇటు వెండి తెరపైనా తనదైన ముద్ర వేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను వరకు సినిమాలు ఉండడమే ఇందుకు నిదర్శనం.
తెలుగులో ఇప్పటికే సత్తా చాటింది ఈ హాట్ యాంకర్. చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి.. ‘కథనం’ వంటి సినిమాల ద్వారా ఏకంగా లీడ్ రోల్ క్యారెక్టర్స్ కూడా పోషించింది. అయితే.. ఇప్పుడు ఔటాఫ్ టాలీవుడ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైందీ బ్యూటీ.
ఇప్పటికే తన తొలి కోలీవుడ్ డెబ్యూ మూవీకి సైన్ చేసింది అనసూయ. తమిళ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి సరసన ఓ సినిమాలో నటించబోతోందీ అమ్మడు. ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ ఛాన్స్ ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది యాంకర్ కమ్ యాక్ట్రెస్.
మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి అప్ కమింగ్ మూవీ ‘భీష్మ పర్వం’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలోకి అనసూయను తీసుకోబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు అమల్ నీరద్ స్పెషల్ ఇంట్రస్ట్ చూపించాడట. వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’లో మమ్ముట్టి లీడ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాలో అనసూయ కూడా యాక్ట్ చేసింది. ఇది చూసిన అమల్ నీరద్.. భీష్మ పర్వంలో ఆమెకు ఇంపార్టెంట్ రోల్ ఆఫర్ చేశాడు.
ఈ ఆఫర్ తో అనసూయ ఫుల్లుగా ఎగ్జయిట్ అవుతోంది. మోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం.. అది కూడా మరోసారి మెగాస్టార్ మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడంతో హ్యాపీగా ఉంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్షాప్ ఏప్రిల్లో జరగనుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం ద్వారా.. భీష్మ పర్వం యూనిట్ తో కలవనుంది అనసూయ.
తెలుగులో ఇప్పటికే సత్తా చాటింది ఈ హాట్ యాంకర్. చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి.. ‘కథనం’ వంటి సినిమాల ద్వారా ఏకంగా లీడ్ రోల్ క్యారెక్టర్స్ కూడా పోషించింది. అయితే.. ఇప్పుడు ఔటాఫ్ టాలీవుడ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమైందీ బ్యూటీ.
ఇప్పటికే తన తొలి కోలీవుడ్ డెబ్యూ మూవీకి సైన్ చేసింది అనసూయ. తమిళ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి సరసన ఓ సినిమాలో నటించబోతోందీ అమ్మడు. ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ ఛాన్స్ ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది యాంకర్ కమ్ యాక్ట్రెస్.
మోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి అప్ కమింగ్ మూవీ ‘భీష్మ పర్వం’. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలోకి అనసూయను తీసుకోబోతున్నారు. ఈ మేరకు దర్శకుడు అమల్ నీరద్ స్పెషల్ ఇంట్రస్ట్ చూపించాడట. వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’లో మమ్ముట్టి లీడ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాలో అనసూయ కూడా యాక్ట్ చేసింది. ఇది చూసిన అమల్ నీరద్.. భీష్మ పర్వంలో ఆమెకు ఇంపార్టెంట్ రోల్ ఆఫర్ చేశాడు.
ఈ ఆఫర్ తో అనసూయ ఫుల్లుగా ఎగ్జయిట్ అవుతోంది. మోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం.. అది కూడా మరోసారి మెగాస్టార్ మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావడంతో హ్యాపీగా ఉంది. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్షాప్ ఏప్రిల్లో జరగనుంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం ద్వారా.. భీష్మ పర్వం యూనిట్ తో కలవనుంది అనసూయ.