Begin typing your search above and press return to search.

'AA20' అన్నీ కలిసొచ్చాయి

By:  Tupaki Desk   |   22 Feb 2020 3:51 PM GMT
AA20 అన్నీ కలిసొచ్చాయి
X
శేషాచలం బ్యాక్ డ్రాప్ లో ఓ కథ అనుకొని మహేష్ కి పాయింట్ చెప్పాడు సుకుమార్. పూర్తి కథ సిద్దం అవ్వకుండానే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చేసింది. మహేష్ తో '1 నేనొక్కడినే ' డిఫరెంట్ రివెంజ్ మూవీ తీసిన సుకుమార్ మళ్ళీ సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తుండటం ఫ్యాన్స్ అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. కాంబో అనౌన్స్ అవ్వగానే సినిమాపై హైప్ వచ్చేసింది. తీరా చూస్తే కొన్ని రోజులకి ప్రాజెక్ట్ క్యాన్సల్ అయింది.

లోలోపలే కొన్ని రోజుల డిస్కర్షన్ జరిగాయి. సరిగ్గా ఓ నెలలో సెట్స్ పైకి వెళ్తుందనాగా క్రియేటీవ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుండి తప్పుకుంటున్నాని చెప్తూ ట్వీట్ వేసి బయటికొచ్చేశాడు మహేష్. వెంటనే బన్నీ తో సినిమా అనౌన్స్ చేసాడు సుకుమార్. అయితే సుకుమార్ మొండిపట్టుదల గురించి కొందరు మాట్లాడుకుంటే మహేష్ అలా చేసి ఉండకూడదని మరికొందరు మాట్లాడుకున్నారు. ఇక ఎట్టకేలకు కథ బన్నీ కి రాసి ఉండటం AA 20 గా సినిమా అనౌన్స్ అయింది.

అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఇటు ఇండస్ట్రీ వర్గాలు , అటు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆదిలో సినిమాకి అడ్డంకులు తగిలినా ఇప్పుడు సినిమా చుట్టూ పాజిటివిటీ ఎక్కువవుతుంది. అవును రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ హీరోగా సినిమా తెరకెక్కనుండటం ఇలా బాగానే కలిసొచ్చింది. ఇక లేటెస్ట్ గా రష్మిక కూడా సినిమాకు మరో లక్కీ చాంప్ అనిపించుకుంటుంది. సరిలేరు నీకెవ్వరు తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు భీష్మ మరో సూపర్ హిట్ అందుకుంది. సుకుమార్ , బన్నీ , రష్మిక ఇలా ముగ్గురు చేసిన ప్రీవియస్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళక ముందే అందరి చూపులు సినిమా మీదే ఉన్నాయి. మరి ఈ ముగ్గురు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటే ఫ్యాన్స్ పండగే.