Begin typing your search above and press return to search.

త‌గ్గేదే లే..! వార్ లో గెలిచి కిడ్స్ తో బ‌న్ని సెలబ్రేష‌న్!!

By:  Tupaki Desk   |   12 May 2021 7:34 AM GMT
త‌గ్గేదే లే..! వార్ లో గెలిచి కిడ్స్ తో బ‌న్ని సెలబ్రేష‌న్!!
X
చైనా నాటిన విత్త‌నం క‌రోనా .. ప‌లు అంత‌ర్జాతీయ జ‌ర్న‌ల్స్ దీనికి ప్రూఫ్ లు చూపిస్తున్నాయి. ఇది ప్ర‌పంచ దేశాల్ని ఒణికిస్తోంది. ముఖ్యంగా దాయాది దేశం నుంచి వ‌చ్చిన క‌రోనా భార‌త‌దేశంలో అమాయ‌క ప్ర‌జ‌ల జీవితాల్ని అల్ల‌క‌ల్లోలం చేస్తోంది.

ఈ వైర‌స్ తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నిచోట్లా విస్త‌రించింది. ముఖ్యంగా హైద‌రాబాద్ లో వీధివీధినా ప్ర‌వేశించింది. అక్క‌డ సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు సెల‌బ్రిటీల్ని వెంటాడుతోంది. వేలాది కార్మికులు ఆధార‌పడి జీవిస్తున్న‌ వినోద‌రంగాన్ని పెద్ద దెబ్బ కొట్టింది. వైర‌స్ ని త‌రిమికొట్టాల‌న్న క‌సి ప్ర‌జ‌ల్లో అంత‌కంత‌కు పెరుగుతోంది. ఎవ‌రికి వారు వారియ‌ర్స్ లా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.

సినీరంగం వ‌ర‌కూ చూస్తే.. ఒక్క మెగా కాంపౌండ్ లోనే ఆరుగురికి సోకింది ఈ వైర‌స్. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ -నాగబాబు- క‌ళ్యాణ్ దేవ్- ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఇప్ప‌టికే ఈ వైర‌స్ ను ఎదుర్కొని వార్ లో గెలిచారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా వైర‌స్ నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. 15 రోజుల క్వారంటైన్ త‌ర్వాత బ‌న్ని పూర్తిగా కోవిడ్ నుంచి కోలుకున్నారు. అత‌డు నిర్భంధంలో ఉన్న‌ప్పుడు దోసెలు స్వ‌యంగా వండి తినిపించిన అర్హ ప్రేమ‌ను ఎవ‌రూ మ‌ర్చిపోలేదు.

ఇదిగో ఇలా డాడీ పూర్తిగా కోలుకుని త‌న‌ గ‌దిలోంచి బ‌య‌ట‌కు రాగానే త‌న‌ను హ‌గ్ చేసుకుని కుమారుడు అయాన్.. కుమార్తె అర్హ ఎంతో సెల‌బ్రేట్ చేసుకున్నారు. వార్ లో గెలిచిన వారియ‌ర్ లా బ‌న్ని ఆనందం చూస్తున్నారు క‌దా.. నిజానికి ఇది ఎంద‌రికో స్ఫూర్తి నిచ్చే వీడియో. దాయాది దేశంపై గెలిచినంత ఆనందం ఆ ముగ్గురిలో క‌నిపిస్తోంది మ‌రి! నిజానికి క‌రోనా వ‌ల్ల 5-8 శాతం మంది మాత్ర‌మే తీవ్ర ఇబ్బంది ప‌డేది. 92 శాతం మందికి ఎలాంటి స‌మ‌స్యా లేదు.. కొద్ది పాటి నీర‌సం ఎదుర్కొని త‌ర్వాత కోలుకుంటున్నారు. బ‌న్నీ మైల్డ్ ల‌క్ష‌ణాల నుంచి వెంట‌నే కోలుకోగ‌లిగారు. ఇక మ‌ళ్లీ పుష్ప షూటింగ్ గురించి ఆలోచిస్తారు. సుక్కూ ఇప్ప‌టికే త‌గ్గేదే లే..! అని బ‌న్నీకి క్లియ‌ర్ క‌ట్ గా చెప్పార‌ట‌. అదీ సంగ‌తి..!