Begin typing your search above and press return to search.
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అల్లరి నరేష్ 'నాంది'...!
By: Tupaki Desk | 29 Oct 2020 7:30 AM GMTహాస్యభరిత చిత్రాలతో వెండితెరపై నవ్వులు పంచిన అల్లరి నరేష్ తన పంథా మార్చుకొని నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ''నాంది''. ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అల్లరి నరేశ్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందిన 'నాంది' - ఎ న్యూ బిగినింగ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ టీజర్ అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'నాంది' షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి న్యూ పోస్టర్ విడుదల చేశారు.
'నాంది' కొత్త పోస్టర్ లో అల్లరి నరేష్ కిటికీ దగ్గర నిలబడి గట్టిగా అరుస్తూ తన బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ ఇంతకముందు ఎప్పుడూ పోషించనటువంటి వైవిద్యమైన పాత్రలో నటిస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ - నవమి - హరీష్ ఉత్తమన్ - ప్రియదర్శి - ప్రవీణ్ - దేవి ప్రసాద్ - వినయ్ వర్మ - నర్సింహారావు - శ్రీకాంత్ అయ్యంగార్ - రమేష్ రెడ్డి - చక్రపాణి - మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు.
'నాంది' కొత్త పోస్టర్ లో అల్లరి నరేష్ కిటికీ దగ్గర నిలబడి గట్టిగా అరుస్తూ తన బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ ఇంతకముందు ఎప్పుడూ పోషించనటువంటి వైవిద్యమైన పాత్రలో నటిస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ - నవమి - హరీష్ ఉత్తమన్ - ప్రియదర్శి - ప్రవీణ్ - దేవి ప్రసాద్ - వినయ్ వర్మ - నర్సింహారావు - శ్రీకాంత్ అయ్యంగార్ - రమేష్ రెడ్డి - చక్రపాణి - మణిచందన ప్రమోదిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సిద్ జే సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి చోటా కె. ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేసారు. ప్రముఖ రచయిత అబ్బూరి రవి సంభాషణలు అందించారు.