Begin typing your search above and press return to search.

మళ్లీ కలిసేందుకు కథ విన్నారట!

By:  Tupaki Desk   |   20 April 2019 1:35 PM GMT
మళ్లీ కలిసేందుకు కథ విన్నారట!
X
అక్కినేని జంట నాగచైతన్య మరియు సమంతలు 'మజిలీ' చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్‌ లో వచ్చిన 'ఏమాయ చేశావే' మరియు 'మనం' చిత్రాలతో పాటు 'మజిలీ' చిత్రం కూడా హిట్‌ గా నిలిచింది. పెళ్లి తర్వాత కలిసి నటించిన సినిమా అవ్వడంతో సమంత చాలా టెన్షన్‌ పడ్డట్లుగా అనిపించింది. అందుకే ఎప్పుడు లేనిది తిరుమల కొండపైకి కాలి నడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. అంతగా మజిలీ సక్సెస్‌ కోసం సమంత కష్టపడింది. మజిలీ సూపర్‌ హిట్‌ అవ్వడంతో నాగ చైతన్య కెరీర్‌ లోనే టాప్‌ చిత్రాల జాబితాలో చేరింది.

మజిలీ చిత్రం తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి నటించాలని అక్కినేని అభిమానులు మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే వీరి కాంబోలో తదుపరి చిత్రంకు టైం పట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కాని సినీ వర్గాల ద్వారా అందుతున్న తాజా సమాచారం ప్రకారం మరీ ఎక్కువ గ్యాప్‌ లేకుండానే మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆర్‌ ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో వీరిద్దరి కలయిక తదుపరి మూవీ ఉంటుందని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం నాగచైతన్య మరియు సమంతలకు అజయ్‌ భూపతి ఒక మంచి కథను వినిపించాడట. ఆ కథకు చైతూ మరియు సామ్‌ ఇంప్రెస్‌ అయ్యారని - దాన్ని డెవలప్‌ చేయాల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అజయ్‌ భూపతి చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత నాగచైతన్య - సమంతల కోసం స్క్రిప్ట్‌ ను సిద్దం చేయబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది లేదంటే ఆ తర్వాత ఏడాదిలో నాగచైతన్య మరియు సమంతల అయిదవ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.