Begin typing your search above and press return to search.

40 ఏళ్ల తరువాత కమల్ రజినీ కాంబో ..?

By:  Tupaki Desk   |   6 Dec 2019 7:33 AM GMT
40 ఏళ్ల తరువాత కమల్ రజినీ కాంబో ..?
X
కమల్ హాసన్ , రజినీకాంత్ వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీ , కమల్ పేర్లు ప్రస్తుతం ఎక్కడ వినిపించిన సంచలనమే అని చెప్పాలి. ఎందుకు అంటే గత కొద్దీ రోజులుగా వారు చేస్తున్న కామెంట్స్ ఆలా ఉన్నాయి. సినిమాలతో బిజీగా ఉంటూనే ఇప్పటికే కమల్ మక్కళ్‌ నీది మయ్యం పార్టీని ప్రారంభించి రాజకీయ ప్రవేశం చేసారు. ఇక రజినీ కూడా రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు అని ఎన్నో సార్లు వినిపించినా కూడా అది జరగలేదు. కానీ , 2021 లో తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ లోపు రజినీ కొత్త పార్టీని పెడతారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కొద్దిరోజుల ముందు కమలహాసన్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రజనీకాంత్‌ పాల్గొన్నారు. అప్పుడు పలు ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఆ సమావేశంలో రజనీకాంత్‌ కూడా రాబోయే కాలంలో పలు ఆసక్తి కరమైన సంఘటనలు జరుగుతాయని , అలాగే అవసరం అయితే తామిద్దరం కలిసి పనిచేస్తామని పేర్కొంటూ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు.

ఇక వీరిద్దరూ నటన లో ఆరితేరిన వారు. ఏ పాత్ర కైనా తమ నటన తో ప్రాణం పోయగల నటులు. అలాగే అంతకుమించి వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. వీరి స్నేహ బంధం గత 40 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతుంది అని ఎన్నో సందర్భాలలో చెప్పారు. కమల్ , రజినీ సినిమాల్లోకి వచ్చిన మొదట్లో కొన్ని సినిమాలలో కలిసి నటించారు. ఆ తరువాత హీరోగా ఎవరికీ వారు ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకోవడం తో కపై కలిసి నటించకూడదని వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరూ ఒక్కసారి కూడా మళ్లీ తెరపై కలిసి కనిపించలేదు. ఇకపొతే ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణలో ఉంది. దీని తరువాత కూడా తలైవన్‌ ఇరుకిండ్రాన్‌ సినిమాలో నటించి , ఆ తరువాత పూర్తిగా రాజకీయాలకి పరిమితం కానున్నారు. ఇక రజినీ విషయానికొస్తే .. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం లో దర్బార్‌ చిత్రాన్ని పూర్తి చేసి , శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

ఒక పక్క సినిమాలు , మరో వైపు రాజకీయాలతో ఎవరికీ వారు బిజీగా ఉన్న సమయంలో ఈ ఇద్దరి గురించి ఒక సంచలనమైన విషయం బయటకి వచ్చింది. రాజకీయంగా కలిసి పనిచేస్తామేమో అని చెప్పిన రజినీ , కమల్ లు .. రాజకీయంగా కమల్, రజనీ కలుస్తారో? లేదో గానీ, మరోసారి సినిమా లో కలవనున్నారన్నది తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే ..ఈ మధ్య కార్తీ నటించిన ఖైదీ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనితో ఖైదీ డైరెక్టర్ కి రజినీ స్వయంగా ఫోన్ చేసి లోకేశ్‌ కనకరాజ్‌ను అభినందించారు. ఆ తరువాత లోకేశ్‌ కనకరాజ్‌ స్వయంగా రజినీకాంత్ కి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఆ సమయం లో చాలా విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ నటుడు రజనీకాంత్‌కు ఒక కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చినట్లు సమాచారం. ఇక మరో సంచలన అంశం ఏమిటంటే లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించే చిత్రాన్ని కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ సినీ ఇంటర్నేషనల్‌ సంస్థలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..ఈ సినిమాలో కమల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా పుర్తి స్పష్టత రావాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే ..