Begin typing your search above and press return to search.

రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఓకే చేసిన టాలీవుడ్ హీరో..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 2:30 PM GMT
రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఓకే చేసిన టాలీవుడ్ హీరో..!
X
యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నటనతో పాటు కథ - స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లో మంచి పట్టు ఉన్న శేష్.. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. ప్రస్తుతం యువ హీరో ''మేజర్'' అనే పాన్ ఇండియా సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

తెలుగుతో పాటుగా మలయాళ హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ బయోగ్రాఫికల్ డ్రామాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే శేష్ రెండు హిందీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేశారని తెలుస్తోంది.

ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అడివి శేష్.. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ను వెల్లడించారు. ఇప్పటికే రెండు హిందీ చిత్రాలకు సైన్ చేశానని.. 'మేజర్' సినిమా తర్వాత వాటి వివరాలు తెలియజేస్తానని శేష్ తెలిపారు.

ప్రస్తుతం తాను పూర్తిగా 'మేజర్‌' పైనే దృష్టి కేంద్రీకరించానని.. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ప్రపంచానికి తీసుకెళ్లాలనుకుంటున్నానని శేష్‌ తెలిపారు. శేష్ చేయబోయే హిందీ చిత్రాల గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

కాగా, 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా ''మేజర్'' తెరకెక్కుతోంది. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టోరీ - స్క్రీన్ ప్లేలో అడివి శేష్ భాగం పంచుకున్నారు. ఇందులో శోభితా దూళిపాళ్ల - సైఈ మంజ్రేకర్ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సోనీ పిక్చర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

తెలుగులో 'మేజర్' సినిమా తర్వాత అడవి శేష్ ''గూఢచారి 2'' సినిమా చేయనున్నారు. 2018లో ఘన విజయం సాధించిన స్పై థ్రిల్లర్ 'గూఢచారి' సినిమాకి సీక్వెల్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది.