Begin typing your search above and press return to search.

'హిట్-2 ' హీరో అడవిశేష్ చేతుల మీదుగా 'ఎంతవారుగాని' టీజర్ రిలీజ్

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:15 AM GMT
హిట్-2  హీరో అడవిశేష్ చేతుల మీదుగా ఎంతవారుగాని టీజర్ రిలీజ్
X
తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రముఖ హీరో అడవి శేష్ 'ఎంతవారు గాని' అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం వెండి తెర పైన, ఓటీటీ వేదికల్లో సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్ ఉన్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పనవరంలేదు. సినిమా ప్రేమికులకు ఇప్పుడిదే ట్రెండ్. ఇందులో భాగంగా స్వస్తికా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో రాజశేఖర్‌ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు నిర్మాతలుగా రూపొందించిన 'ఎంతవారు గాని' అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్, మేఘనా రాజ్‌పుత్, దివ్యాంగన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్. శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. దర్శకుడు ఎన్ శ్రీనివాస్ ను'నివాస్' అనే పేరుతో తన రంగీలా సినిమాతో ఎడిటర్ గా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ తరువాత'క్షణ క్షణం','గాయం','మనీ మనీ','రాత్రి','అంతం','దౌడ్' వంటి ఎవర్ గ్రీన్ థ్రిల్లర్ సినిమాలకు సౌండ్ డిజైనర్ గా పని చేసి అవార్డులను అందుకున్నారు. దర్శకునిగా తనకిది మొదటి సినిమా. ఈ సందర్బంగా తను మాట్లాడుతూ.., అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో నిర్మించిన సినిమా టీజర్ అడవి శేష్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సినిమా బృందాన్ని హీరో అడవి శేష్ అభినందించారు. ప్రస్తుతం కొనసాగుతున్న థ్రిల్లర్ జోనర్ జర్నీలో 'ఎంతవారు గాని' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశించారు.

టీజర్ ను  గమనిస్తే సస్పెన్స్, థ్రిల్, ఎంటర్టైన్మెంట్ అధ్భుతంగా కనిపించాయి. అంతే కాకుండా క్వాంటం ఫిజిక్స్ అనే ఆసక్తికర సైంటిఫిక్ అంశం చుట్టూ కథ తిరుగుతుంది. సైంటిఫిక్ రీసెర్చ్ ల్యాబ్ వేదికగా జరుగతున్న సంఘటనలు మరింత ఆసక్తిని రేకత్తిస్తున్నాయి. అనుక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్న టీజర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచాయి.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ప్రవీణ్ కె బంగారి, సంగీత దర్శకుడిగా విజయ్ కురాకుల,  ఆర్ట్ డైరెక్టర్ గా జెకే మూర్తి పనిచేశారు. ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.