Begin typing your search above and press return to search.

నాని 'వి' సినిమా థియేటర్స్ లోనే చూడాలి : హీరోయిన్

By:  Tupaki Desk   |   9 July 2020 5:30 PM GMT
నాని వి సినిమా థియేటర్స్ లోనే చూడాలి : హీరోయిన్
X
అదితి రావ్ హైదరీ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘సూఫీయుమ్ సుజాతయుమ్’. ఇటీవల డిజిటల్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ మలయాళ సినిమాలో జయసూర్య ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ సినిమాకు నరణిపుళ శనవాస్ దర్శకత్వం వహించగా ఫ్రైడే ఫిలిం హౌస్ బ్యానర్ పై విజయ్ బాబు నిర్మించారు. మలయాళ సినిమా చరిత్రలో ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన ఫస్ట్ సినిమాగా 'సూఫీయుమ్ సుజాతయుమ్' నిలిచింది. ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ కే మొగ్గు చూపింది. కాగా ఈ సినిమా రిలీజైన తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే మాటలు రాని అమ్మాయిగా అదితి రావ్ హైదరీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మమ్ముట్టి నటించిన 'ప్రజాపతి' సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన హైదరి 14 ఏళ్ళ తర్వాత మలయాళంలో 'సూఫీయుమ్ సుజాతయుమ్’ లో నటించింది.

ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడిన హైదరీ సినిమాల సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించను అని చెప్పుకొచ్చింది. సినిమాకి సైన్ చేసిన తర్వాత కంప్లీట్ అయ్యే ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తుంటానని వెల్లడించిందట. తనకు భాషతో సంబంధం లేదని.. పాత్ర నచ్చితే ఏ భాష అయినా ఒకటే అని.. స్టోరీ డైరెక్టర్ ముఖ్యమని.. 'సూఫీయుమ్ సుజాతయుమ్’ సినిమాలో తన క్యారెక్టర్ చాలా నచ్చిందని చెప్పింది. ఇక సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవడం గురించి మాట్లాడుతూ థియేటర్స్ అనుభూతి ఎంతైనా వేరేగా ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్స్ బిజినెస్ పరంగా సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేయడం తప్పుకాదు. కొన్ని సినిమాలు ఓటీటీలో అయినా ఆదరణ లభిస్తుంది. అలాంటి సినిమాయే 'సూఫీయుమ్ సుజాతయుమ్’. కానీ కొన్ని సినిమాలు కచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి. అలాంటిదే నేను నటించిన తెలుగు మూవీ 'వి' అని చెప్పుకొచ్చింది.

కాగా తెలుగు రాష్ట్రంలో పుట్టిన అదితి రావు హైదరి ఇతర ఇండస్ట్రీలలో కూడా నిరూపించుకుంది. 'ఢిల్లీ 6' 'యా శాలి జిందగీ' 'రాక్ స్టార్' 'కూబ్సూరత్' 'వాజిర్' 'భూమి' 'పద్మావత్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 'సమ్మోహనం' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ద్విభాషా చిత్రం 'నవాబ్'.. ఉదయనిధి స్టాలిన్ - మిస్కిన్ కాంబోలో వచ్చిన 'సైకో' సినిమాలలో నటించింది. ఇక ఇంద్రగంటి దర్శకత్వంలో నాని - సుధీర్ బాబు లతో కలిసి ఆమె నటించిన 'వి' సినిమాలో రిలీజ్ కి రెడీగా ఉంది.