Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌' మరో అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌

By:  Tupaki Desk   |   10 Jun 2021 10:30 AM GMT
ఆదిపురుష్‌ మరో అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌
X
ప్రభాస్ బాలీవుడ్‌ మూవీ ఆదిపురుష్‌ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా కు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఓమ్‌ రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామాయనం ఇతి వృత్తంలో రూపొందుతున్న ఈ సినిమా కు సంగీతాన్ని ఎవరు అందిస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఓమ్‌ రౌమ్‌ ఈ సినిమా సంగీత బాధ్యతలను సచేత్‌ - పరంపర లకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఓమ్‌ రౌత్‌ గత చిత్రం తానాజీ చిత్రంలోని రెండు పాటలకు ఈ సంగీత దర్శకద్వయం ట్యూన్స్ ను అందించారు. ఆ పాటలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో ఆదిపురుష్‌ పూర్తి బాధ్యతను వారికే అప్పగించారని తెలుస్తోంది.

సచేత్‌ మరియు పరంపర లు బాలీవుడ్‌ లో ఈమద్య కాలంలో బిజీ మ్యూజీషియన్స్ గా పేరు దక్కించుకున్నారు. యూత్‌ ఫుల్‌ ట్యూన్స్ ఇస్తారనే పేరు ఉన్న వీరిద్దరు ఈ ఆఫర్ ను దక్కించుకోవడంతో వీరి పేరు మరింతగా మారు మ్రోగిపోతుంది. ఇతిహాస కథ అవ్వడం వల్ల పాటలు మరియు బ్యాక్‌ గ్రౌండ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరం. అలాంటి ఈ సినిమా కు ఈ యంగ్‌ సంగీత దర్శకులను తీసుకోవడంలో ఓమ్‌ రౌత్‌ ఉద్దేశ్యం ఏంటో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్‌ కు జోడీగా ఈ సినిమా లో కృతి సనన్ నటిస్తున్న విషయం తెల్సిందే. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా రావణుడిగా బాలీవుడ్‌ స్టార్ సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోషన్‌ గ్రాఫిక్స్ తో ఈ సినిమా విజువల్‌ వండర్ గా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తో ప్రభాస్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.