Begin typing your search above and press return to search.

'ట్రక్ డ్రైవర్'గా మారి స్ఫూర్తిగా నిలుస్తున్న నటి..!

By:  Tupaki Desk   |   8 Jun 2021 4:30 PM GMT
ట్రక్ డ్రైవర్గా మారి స్ఫూర్తిగా నిలుస్తున్న నటి..!
X
ప్రస్తుతం కరోనా కష్టకాలంలో మనకు తెలిసిన ఒక నిజం ఏంటంటే.. ఈ మహమ్మారి వలన తీవ్రంగా దెబ్బతిన్న రంగంలో సినిమా రంగం ఒకటి. లాక్డౌన్ కారణంగా నటులంతా ఇళ్లలో పనిలేకుండా కూర్చుని.. కరోనా సంక్షోభం ముగిస్తే బాగుండు అని వేచి చూస్తున్నారు. వాస్తవానికి పెద్ద హీరోలు, సెలబ్రిటీలు కొన్ని నెలలు పని లేకపోయినా ఉండగలుగుతారు. కాని చిన్న చిన్న పాత్రలు వేసే కళాకారులు వారి కుటుంబాలను పోషించడానికి పగలురాత్రి కష్టపడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ నటి కరోనా సమయంలో ఆదాయం లేక ట్రక్ డ్రైవింగ్ మొదలుపెట్టింది. ఆ నటి ఎవరో కాదు మలయాళం - తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించే కార్తీక మాథ్యూ. ఈ నటికి నటనతో పాటు డ్రైవింగ్ కూడా బాగా తెలుసట.

అందుకే లాక్డౌన్ లో ఖాళీగా ఉండలేక తన వద్ద ఉన్న డబ్బుతో ఓ ట్రక్ కొనుక్కుందట. అప్పటినుండి ఫ్రూట్స్ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తోంది. తన ట్రక్ ద్వారా ఓ ఏరియాలోని పైనాపిల్ - కొబ్బరి బొండాలు మరో ఏరియాకు రవాణా చేస్తోంది. ఈ విషయం కేరళలోని ఓ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చూసి గుర్తించడంతో ఆమె డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు కార్తీక చాలా మలయాళం - తమిళ సినిమాల్లో నటించింది. 2001లో సినీ కెరీర్ ప్రారంభించిన కార్తీక.. కేవలం మలయాళం తమిళ సినిమాలు మాత్రమే చేసింది. ఇక 2009లో పెళ్లి చేసుకొని యాక్టింగ్ చేయడం తగ్గించింది. కార్తీక చివరిగా 2015లో పూలన్ విశారనై 2 సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత కార్తీక మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. కార్తీకకు కెరీర్ పరంగా 'నామ్ నాడు' 'డిండిగుల్ సారథి' సినిమాలతో మంచి నేమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కార్తీక మాథ్యూ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.