Begin typing your search above and press return to search.

ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం.!? ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   4 April 2020 9:50 AM GMT
ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం.!? ఏం జరిగింది?
X
దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఇంత కర్ఫ్యూ వేళ కారు నడిపి ప్రమాదానికి గురయ్యిందన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. మద్యం తాగి స్నేహితులతో కలిసి జాలీగా రైడ్ కు వెళ్లిందని.. ప్రమాదంలో హీరోయిన్ తోపాటు ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. బెంగళూరు నగరంలోని ఫ్లైఓవర్ పిల్లర్ కు హీరోయిన్ కారు ఢీకొనడంతో వారి కారు నుజ్జునుజ్జు అయ్యిందని సమాచారం.

ప్రముఖ కన్నడ హీరోయిన్ షర్మిల మండ్రే తాజాగా బెంగళూరులో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి శనివారం అర్ధరాత్రి స్నేహితులతో కలిసి కారులో జాలీ రైడ్ కు వెళ్లిందని ప్రచారం సాగుతోంది. బెంగళూరులోని వసంతనగర్ ఫ్లైఓవర్ కింద భాగంలోని పిల్లర్ ను ఢీకొట్టినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో నటి షర్మిల మండ్రే ముఖంకు గాయాలైనట్టు తెలిసింది. శరీరంలోని పలుచోట్ల కూడా గాయాలయ్యాయని సమాచారం. ఇక ఈ కారును షర్మిల మండ్రే స్నేహితుడు లోకేష్ నడిపుతున్నాడని.. అతడే ఆమె బాయ్ ఫ్రెండ్ అని ప్రచారం సాగుతోంది.

కారు ప్రమాదం జరిగాక హీరోయిన్ షర్మిల, ఆమె స్నేహితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారని తెలిసింది. ఆ కారులో మొత్తం నలుగురు ఉన్నారని.. వారికి తీవ్రగాయలైనట్టు సమాచారం.

కాగా హీరోయిన్ షర్మిల మద్యం తాగి నడపడం వల్లే ప్రమాదం జరిగిందనే ఆరోపణలున్నాయి.. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. వైద్య నివేదికలు వచ్చాక దీనిపై పోలీసులు అసలు నిజాలు బయటపెడుతారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం అధికారికంగా తెలియలేదు.