Begin typing your search above and press return to search.

సైబర్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి పవిత్ర..!

By:  Tupaki Desk   |   30 Jun 2022 8:30 AM GMT
సైబర్ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి పవిత్ర..!
X
సీనియర్ నటి పవిత్ర లోకేష్ ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ గా రాణిస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా ఆమె వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌ తో పవిత్ర సహజీవనం చేస్తోందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చక్కర్లు కొట్టాయి.

ఎక్కడికైనా నరేష్ - పవిత్ర ఇద్దరూ కలిసే వెళ్లడం.. ఇటీవల మహాబలేశ్వర్ లో ఒక స్వామిజీని దర్శించుకోవడం వంటివి ఈ వార్తలకు బలం చేకూర్చింది. అంతేకాదు ఎన్నిసార్లు వారి బంధంపై రూమర్స్ వచ్చినా నేరుగా ఖండించకపోవడంతో నెట్టింట ఇదే హాట్ టాపిక్ గా మారింది.

అయితే తాజాగా ప‌విత్రా లోకేష్ బెంగుళూరు సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్‌ ను క్రియేట్ చేయ‌ట‌మే కాకుండా.. తనకు ఇబ్బంది క‌లిగించేలా.. ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారంటూ పోలీసులకు తెలిపింది. పవిత్ర ఫిర్యాదును స్వీకరించిన కర్ణాటక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, కన్నడలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి చెందిన పవిత్ర.. ఆ సపోర్ట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. ఈమె 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్‌ ను వివాహం చేసుకుంది. ఆయనకది రెండో వివాహం. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే సుచేంద్ర ప్ర‌సాద్‌ తో మనస్పర్థల కారణంగా పవిత్ర కొన్నాళ్లుగా భర్త కు దూరంగా ఉంటోందని టాక్. ఇప్పటి వరకు వీళ్లిద్దరూ విడిపోయినట్లు వార్తలేమీ రాలేదు.

కానీ తన సహ నటుడు వీకే న‌రేష్‌ తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని.. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని.. ఇందు కోసం ఆమె విడాకుల‌కు అప్లై చేసిందనే వార్త‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.