Begin typing your search above and press return to search.
షాకింగ్ : మెగాస్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్
By: Tupaki Desk | 15 Jan 2022 8:45 AM GMTసంక్రాంతి రోజు మెగాస్టార్ అభిమానులకు తీపి కబురు చెబుతారని ఎదరుచూస్తే బ్యాడ్ న్యూస్ చెప్పేశారు. సంక్రాంతి బరిలో నిలిచిన పాన్ ఇండియా మూవీస్ పాండమిక్ కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి 7న విడుదల కావాల్సిన `ఆర్ ఆర్ ఆర్`, జనవరి 14న విడుదల కానున్న `రాధేశ్యామ్` రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` మూవీ కూడా వాయిదా పడుతుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
అయితే చిత్ర బృందం మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. దీంతో నిజంగానే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలకు బలం చేకూరింది. తాజాగా ఆ వార్తని నిజం చేస్తూ మేకర్స్ సంక్రాంతి రోజున మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.
`ఆచార్య` ఫిబ్రవరి 4న విడుదల కానుందని ఇంతకు ముందే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తేదీని ఈ మూవీ రిలీజ్ కావడం లేదంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలని నిజం చేస్తూ శనివారం చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు.
`కరోనా , ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా మెరుపు వేగంతో వ్యాపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా `ఆచార్య` మూవీని వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తో మీ ముందుకు వస్తాం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కోవిడ్ ప్రొటోకాల్ ని పాటిస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వుంటారని ఆశిస్తున్నాం` అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కనిపించబోతోంది.
దేవాదాయ భూముల కుంభ కోణం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల రెజీనా, మెగాస్టార్ లపై చిత్రీకరించిన `శానా కష్టం వచ్చిందే మందాకినీ`... సాంగ్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ పాట తమని కించపరిచే విధంగాద వుందని తెలంగాణ, ఏపీ కి చెందిన ఆర్ ఎంపీ డాక్టర్లు పోలీసుల్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది.
అయితే చిత్ర బృందం మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. దీంతో నిజంగానే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందన్న వార్తలకు బలం చేకూరింది. తాజాగా ఆ వార్తని నిజం చేస్తూ మేకర్స్ సంక్రాంతి రోజున మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.
`ఆచార్య` ఫిబ్రవరి 4న విడుదల కానుందని ఇంతకు ముందే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తేదీని ఈ మూవీ రిలీజ్ కావడం లేదంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలని నిజం చేస్తూ శనివారం చిత్ర బృందం ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు.
`కరోనా , ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా మెరుపు వేగంతో వ్యాపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా `ఆచార్య` మూవీని వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తో మీ ముందుకు వస్తాం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కోవిడ్ ప్రొటోకాల్ ని పాటిస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వుంటారని ఆశిస్తున్నాం` అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కనిపించబోతోంది.
దేవాదాయ భూముల కుంభ కోణం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల రెజీనా, మెగాస్టార్ లపై చిత్రీకరించిన `శానా కష్టం వచ్చిందే మందాకినీ`... సాంగ్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ పాట తమని కించపరిచే విధంగాద వుందని తెలంగాణ, ఏపీ కి చెందిన ఆర్ ఎంపీ డాక్టర్లు పోలీసుల్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది.