Begin typing your search above and press return to search.
డైరెక్టర్ శంకర్ కు మాతృవియోగం..!
By: Tupaki Desk | 18 May 2021 3:35 PM GMTప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి ఎస్.ముత్తు లక్ష్మి (88) మరణించారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ తల్లి చనిపోయిన విషయం తెలియగానే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను ఫోన్ లో పరామర్శిస్తున్నారు. కోలీవుడ్ తోపాటు ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఎవరూ తన ఇంటికి రావద్దని శంకర్ విజ్ఞప్తి చేసారని తెలుస్తోంది. ముత్తు లక్ష్మి అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.
కాగా, శంకర్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉంటానని.. తన సక్సెస్ గురించి గర్వపడుతూ ఉంటుందని పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. అంతేకాదు శంకర్ ఏ సినిమా స్టార్ట్ చేసినా కూడా ముందుగా తన తల్లి ఆశీర్వాదంతోనే మొదలు పెట్టేవాడని అందరూ చెప్పుకుంటారు. 'ఒకే ఒక్కడు' 'జీన్స్' 'జెంటిల్ మెన్' 'భారతీయుడు' 'అపరిచితుడు, 'ఐ' 'రోబో' తదితర చిత్రాలతో శంకర్ టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా.. రణవీర్ సింగ్ తో ఓ మూవీ కమిట్ అయ్యాడు. ఇక కమల్ హాసన్ తో తలపెట్టిన 'ఇండియన్ 2' సినిమా ప్రొడ్యూసర్స్ తో వివాదం తెచ్చిపెట్టింది.
కాగా, శంకర్ తన తల్లితో చాలా సన్నిహితంగా ఉంటానని.. తన సక్సెస్ గురించి గర్వపడుతూ ఉంటుందని పలు ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. అంతేకాదు శంకర్ ఏ సినిమా స్టార్ట్ చేసినా కూడా ముందుగా తన తల్లి ఆశీర్వాదంతోనే మొదలు పెట్టేవాడని అందరూ చెప్పుకుంటారు. 'ఒకే ఒక్కడు' 'జీన్స్' 'జెంటిల్ మెన్' 'భారతీయుడు' 'అపరిచితుడు, 'ఐ' 'రోబో' తదితర చిత్రాలతో శంకర్ టాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా.. రణవీర్ సింగ్ తో ఓ మూవీ కమిట్ అయ్యాడు. ఇక కమల్ హాసన్ తో తలపెట్టిన 'ఇండియన్ 2' సినిమా ప్రొడ్యూసర్స్ తో వివాదం తెచ్చిపెట్టింది.