Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ప్రముఖులకు హీరోయిన్ సూటి ప్రశ్న...!

By:  Tupaki Desk   |   18 Jun 2020 5:15 AM GMT
బాలీవుడ్ ప్రముఖులకు హీరోయిన్ సూటి ప్రశ్న...!
X
సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌ కు చెందిన కొందరు ప్రముఖులు టార్గెట్‌ అవుతున్నారు. ముఖ్యంగా స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ గా పేరున్న కరణ్‌ జోహార్‌ ను ఇందులో ఎక్కువ మంది టార్గెట్‌ చేస్తున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ.. సల్మాన్‌ ఖాన్‌.. ఎక్తా కపూర్‌ తో పాటు మరికొందరు ఇండస్ట్రీకి సంబంధం లేని వారు ఎదుగకుండా అడ్డు పడుతున్నారు అనేది కొందరి వాదన. బాలీవుడ్‌ ప్రస్తుతం రెండుగా చీలి కొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ పై విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం వారికి మద్దతు తెలుపుతున్నారు.

ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ కు జోడీగా నటించిన నికిషా పటేల్‌ బాలీవుడ్‌ కు చెందిన ఆ ప్రముఖులపై విమర్శలు గుప్పించింది. ఈ సందర్బంగా నేను మిమ్ములను ఒకే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు(బాలీవుడ్‌ ప్రముఖులు) సుశాంత్‌ అంత్య క్రియలకు ఎందుకు హాజరు కాలేదు. మీ మానవత్వం ఏమైపోయింది. ఆ సమయంలో మీరు లంచ్‌ చేస్తూ బిజీగా ఉండి పోయారా అంటూ సూటి ప్రశ్న సంధించింది.

నికిషా పటేల్‌ ప్రశ్నకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. సుశాంత్‌ మృత దేహంను నేరుగా చూసి నివాళ్లు అర్పించేందుకు ఆయన ఏమైనా స్టార్‌ వారసుడా వాళ్లు సుశాంత్‌ వంటి వాళ్లు చనిపోతే ఎందుకు పట్టించుకుంటారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎవరి వల్ల అయితే సుశాంత్‌ మృతి చెందాడో వాళ్లు సుశాంత్‌ అంత్యక్రియలకు హాజరు కాలేదు అంటూ మరికొందరు నెటిజన్స్‌ నికిషా పటేల్‌ పోస్ట్‌ కు కామెంట్‌ చేశారు. మొత్తానికి నికిషా పటేల్‌ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఆమెకు మద్దతుగా భారీగా ట్వీట్స్‌ పడుతున్నాయి.