Begin typing your search above and press return to search.

నెక్స్ట్ సంక్రాంతి టార్గెట్ ఫిక్స్.. ఈసారి బరిలో ఎవరంటే

By:  Tupaki Desk   |   30 Jan 2023 8:00 AM GMT
నెక్స్ట్ సంక్రాంతి టార్గెట్ ఫిక్స్.. ఈసారి బరిలో ఎవరంటే
X
సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికే కాదు సినీ పరిశ్రమకు కూడా ఇదొక పెద్ద పండగ. 2023 సంక్రాంతిలోనూ భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య బరిలో నిలిచాయి. తమిళం నుంచి వారిసు, తునివు రిలీజ్ చేశారు. అన్ని చిత్రాలు మంచి కలెక్షన్స్ చేశాయి. అయితే ఈ జాతర పూర్తయి ఇంకా పది రోజులు కూడా కాలేదు అప్పుడే నిర్మాతలు 2024 సంక్రాతిపై ఫోకస్ పెట్టారు. తమ చిత్రాలను పండగ సమయానికి రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.దీంతో
ప్రతిసారిలానే ఈసారి కూడా బాక్సాఫిస్ వద్ద భారీపోటి నెలకొంది. ఈసారి పండగ బరిలో రామ్ చరణ్,అల్లు అర్జున్, బాలయ్య సహా పలువురు హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా వివరాలు ఏంటో చూద్దాం.

ఈ సంక్రాంతిలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ .. పుష్ప 2 ను నిర్మిస్తోంది. పుష్ప హిట్ తో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. సుకుమార్ 2024 సంక్రాంతికి విడుదల చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారట. ఇక తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్ సీ15 కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

ఇకపోతే గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమాలన్నీ అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తే.. వచ్చే సంక్రాంతికి మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టు అవుతుంది. బాక్సాఫీస్ షేక్ అవుతుంది.

ఇంకా వచ్చే సంక్రాంతి బరిలో బాలకృష్ణ కూడా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఆయన కథానాయకుడిగా.. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ది ఘోస్ట్ తో పరాజయన్ని అందుకున్న కింగ్ నాగార్జున ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రచయిత ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ భిన్న కథలో నటించబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇందులో పూజ హెగ్డే ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ చిత్రాన్ని కూడా త్వరగా పూర్తిచేసి సంక్రాంతి బరిలోనే దింపాలని నాగ్ భావిస్తున్నారట. అలా ఈ సంక్రాంతికి చిరు బాలయ్య పోటీ పడగా.. వచ్చే సంక్రాంతికి నాగార్జున బాలయ్య పోటీ పడనున్నట్లు అర్థమవుతోంది.

ఇక మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న కొత్త చిత్రం సైంధవ. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇందులో వెంకీ పవర్ఫుల్ యాక్షన్ పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే ఈ మూవీని ఈ ఏడాది క్రిస్మస్ పండక్కి ప్రేక్షకులకు అందించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తుందట.